సీఎం చంద్రబాబు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. రెండు వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. ఇటీవలి వరకు వాడిన బెల్ తయారీ ఛాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్కు మారారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు దీన్ని ఎంపిక చేశారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
ఆంధ్రప్రదేశ్కి చెందిన మరో యువకుడు అమెరికాలో మృతిచెందాడు.. ఎనిమిది నెలలుగా బోస్టన్ లో ఉద్యోగం చేస్తున్న మార్టూరుకు చెందిన యువకుడు పాటిబండ్ల లోకేష్.. బోస్టన్ సిటీలో ఈతకొలనులో పడి మృతిచెందాడు..
పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట యముడిగా మారాడు.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది..
శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది.. అయితే, అనూహ్యంగా చోరీ సొత్తును నిన్న రాత్రి ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు దొంగలు.. ఇక, సదరు దొంగలు పడేసి వెళ్లిపోయిన నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కించారు స్థానికులు..
మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..