CM Chandrababu: అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది..
- అన్నదాతలు ఆందోళన చెందవద్దు..
- రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..
- అది నమ్మే ప్రభుత్వం మాది-సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతు సమస్యలపై, గిట్టుబాటు ధరలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న తరుణంలో ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా… ఒకడుగు ముందుకు వేసి వారికి అండగా నిలుస్తున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలని నిర్ణయించాం. ఈ నిర్ణయంతో 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతులు ఉల్లి పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి వారికి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ – పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు చెల్లిస్తాం. ఆర్థికంగా ప్రభుత్వంపై భారమైనా…రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్ణయం తీసుకున్నాం..” అని పేర్కొన్నారు..
Read Also: H-1B visa: ట్రంప్ H-1B వీసా నిబంధనలతో ఎవరిపై ప్రభావం .? ఎవరిపై ఉండదు..?
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఇక, “ఇదొక్కటే కాదు…15 నెలల కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా ఉండే విషయంలో ఎప్పుడూ వేగంగానే స్పందించాం. PM Kisan – అన్నదాత సుఖీభవ కింద రూ.3200 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మామిడి రైతులు మద్దతు ధర కోల్పోతే రూ.260 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా HD పొగాకు ధర పతనమైతే రూ.271 కోట్లు ఖర్చు చేసి వారికి భరోసా కల్పించాం. రూ.14 కోట్లు ఖర్చు చేసి కోకో గింజలకు కిలోకు రూ.50 లు చెల్లించాం. కాఫీ పంటకు బెర్రీ బోరర్ వ్యాప్తిని అరికట్టేందుకు కేజీ కాఫీకి రూ.50లు నష్టపరిహారం ఇచ్చి గిరిజన రైతులకు సాయంగా నిలిచాం. టమాటా రైతులు నష్టపోకుండా మద్దతు ధర లభించేలా రూ.12 కోట్లు ఖర్చు చేసి మార్క్ ఫెడ్ ద్వారా సేకరించి ఆదుకున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు అకౌంట్లలో వేశాం. 15 నెలల కాలంలో ధాన్యం కొనుగోలుకు రూ. 13,500 కోట్లు ఖర్చు చేశాం. రైతుల సమస్యలపై చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. అన్నదాతలు ఎవరూ ఏ విషయంలోనూ ఆందోళన చెందవద్దు. మెరుగైన సాగు పద్ధతులు పాటిస్తూ…. డిమాండ్ ఉన్న పంటలు సాగుచేస్తూ… ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ…. సాగును లాభదాయకం చేసుకుందాం..” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
#FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా….ఒకడుగు ముందుకు వేసి వారికి అండగా నిలుస్తున్నాం. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు…— N Chandrababu Naidu (@ncbn) September 20, 2025
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!