Vasantha Krishna Prasad: జోగి రమేష్కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసు..!
- జోగి రమేష్ కు కౌంటర్ ఇచ్చిన వసంత కృష్ణ ప్రసాద్..
- అసెంబ్లీలో NTPSలో బూడిద సమస్య గురించి ప్రశ్న అడిగా..
- సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుంది..
- NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి మాట్లాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. మైలవరం, పెడన, పెనమలూరు తిరిగి తిరిగి ప్రజలు ఛీ కొడితే ఇప్పుడు మళ్లీ మైలవరం వచ్చాడు అంటూ సెటైర్లు వేశారు.. ఇక, బుడమేరు వరదలపై ఏడాదిలోగా గండ్లు పూడ్చి పనులు చేశాం.. వంద శాతం చెరువులు నింపాం.. అసలు నువ్వు మంత్రిగా ఉన్నపుడు దోచుకోవటం తప్ప మైలవరంకి ఏం చేశావు అని నిలదీశారు.. అయితే, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ హయాంలో కౌంటర్ పెట్టి జోగి రమేష్ బూడిద అమ్మిన విషయం అందరికీ తెలుసు అంటూ ఆరోపించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..
Read Also: Madhu Yaskhi : కాళేశ్వరం కుంభకోణం: కవిత, కేసీఆర్పై యాష్కీ సంచలన ఆరోపణలు
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
కాగా, వీటీపీఎస్లో ఫ్లయాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్కి తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేసిన విషయం విదితమే.. ఈ బూడిద డంపింగ్ యార్డు వల్ల ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని గ్రామాల్లో నీరు, గాలి కాలుష్యం బారిన పడే అవకాశం ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం నుంచి సురక్షింగా ఉండాలంటే, గ్రామాలను ఆదుకోవాలి, చెట్లు పెంచాలని కోరుతున్నాం, తక్షణమే అక్రమ డంపింగ్ ను స్వాధీనం చేసుకోకపోతే మా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. లోకల్ లారీ ఓనర్స్ ను ఆదుకునే విధంగా టెండర్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అలాగే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని జోగి రమేష్ మండిపడగా.. ఇప్పుడు జోగి రమేష్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
తాజావార్తలు
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. నోయిడా, గుర్గావ్, ఘాజియాబాద్లో జనజీవనం అస్తవ్యస్తం
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
-
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
-
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!