డబ్బుందని ఒక పెద్ద కోటేశ్వరుడిని నెల్లూరు లోక్సభకు, కోటేశ్వరురాలిని కోవూరు అసెంబ్లీకి నిలబెట్టారని వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరన్నారు.
పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు.