Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jaganmohan Reddy Speech In Public Meeting At Konakanamitla

CM YS Jagan: వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

NTV Telugu Twitter
Published Date :April 7, 2024 , 6:20 pm
By Mahesh Jakki
CM YS Jagan: వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు. తనతో కలిసి నడిచేందుకు మీరంతా సిద్దమేనా అంటూ ప్రజలను జగన్‌ కోరారు. ప్రజలందరికీ నచ్చిన రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమిగా వస్తున్నారని విమర్శించారు. జరగబోయే ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలే కాదని.. అన్నీ సామాజిక వర్గాలకు జరిగే న్యాయాన్ని కొనసాగిస్తూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలని సీఎం పేర్కొన్నారు.

Read Also: Botsa Satyanarayana: మళ్లీ జగన్‌ ప్రభుత్వం రావడం ఖాయం..

రాబోయే ఐదేళ్ళలో మన భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలని తెలిపారు. ఇవి జగన్ కు.. చంద్రబాబుకు మధ్య ఎన్నికలు కావు.. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్ పేదల పక్షమని.. మీ ఓటు మంచి కొనసాగుతుందా లేదా అని నిర్ణయిస్తుందన్నారు. మీ ఓటు జగన్‌కు వేస్తే పథకాలు కొనసాగింపు.. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అని.. అందుకే బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబు దారి ఎప్పుడు అడ్డదారి.. ఆయన విలువలు పాతాళంలో ఉంటాయన్నారు. చంద్రబాబు పేరు గుర్తొచ్చేది వెన్నుపోటు.. దగా.. మోసం.. అబద్ధాలు.. కుట్రలు.. ఇవి ఆయన మార్కు రాజకీయాలు అంటూ విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడని.. అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి ఫించన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లతో ఫించన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించారని అన్నారు. పెన్షన్లు పేదవారి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వెళ్లి ఇవ్వటం నేరమట అంటూ.. పేదల వద్దకు వెళ్లి వాలంటీర్లు ఇవ్వటం గత 56 నెలలుగా జరుగుతుందన్నారు. మన ప్రభుత్వంలో ఏ వారమైనా.. గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. వెయ్యి ఇచ్చే పెన్షన్‌ను మూడు వేలకు పెంచుకుంటూ పోయి వారి ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నామన్నారు.

Read Also: EC Notices To Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ విషయంపై నోటీసులు ఇచ్చిన ఈసీ..!

చంద్రబాబు జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని ఇచ్చాయి.. గంటల కొద్దీ క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడి తీసుకోవాలన్నారు. చంద్రబాబు కుటిల యత్నం పెన్షన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను మందే ఎండలో రోడ్డుపైకి తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ కోసం 30 మందికి పైగా అవ్వా, తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు ఈ చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. ఆయన రాజకీయాలకు అనేక మంది అవ్వా తాతలు మరణించారన్నారు. 56 నెలలుగా ఒకటో తారీఖున పెన్షన్ అందించామన్నారు. ఎన్నికల సమయంలో.. అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగిందన్నారు. అది ఆగలేదు.. ఆపబడిందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP CM YS Jaganmohan Reddy
  • AP Elections 2024
  • cm jagan speech
  • CM YS Jagan

తాజావార్తలు

  • RRB Technician Recruitment 2025: 10th అర్హతతో రైల్వే జాబ్ కొట్టే ఛాన్స్.. 6,180 టెక్నీషియన్ జాబ్స్ రెడీ

  • Yogandhra 2025: విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి.. ఫుల్ లిస్ట్ ఇదే!

  • Iran-Israel: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణ దాడి.. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు

  • Gold Rates: కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

  • Top Headlines @9AM : టాప్ న్యూస్

ట్రెండింగ్‌

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions