Kakarla Suresh: ఉదయగిరి మండలంలో పల్లె పల్లెకు కాకర్ల.. బ్రహ్మరథం పట్టిన పల్లెవాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: ఉదయగిరి మండలంలో ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పల్లె ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, తనను గెలిపించాలని ప్రజలను కాకర్ల సురేష్ అభ్యర్థించారు. పుల్లాయపల్లెలో టీడీపీ సీనియర్ నాయకులు కే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు గజమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామస్తులందరికీ విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
ముందుగా శకునాల పల్లె వైసీపీ సీనియర్ నాయకులు కారంపూడి చెన్నకేశవులు నాయుడు.. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నబోయిన చంచల బాబు యాదవ్, ఉదయగిరి మండల అధ్యక్షులు బయన్న, తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు, సీతారాంపురం మండలం క్లస్టర్ ఇంచార్జ్ వెంగళ శెట్టి వెంకటేశ్వర్లు, జనసేన కోఆర్డినేటర్ బోగినేని కాశీ రావు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి రంగారావు, యువ మోర్చా అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జనసేన అధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాసులు, ఆల్లూరు రవీంద్ర చంద్రారెడ్డి, ప్రసన్న, అబ్రహం, జాషువా, పిడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
అనంతరం వింజమూరు మండలం కిస్తీపురం, బుక్కపురం, చింతలపాలెం, చంద్రపాడియా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవి ఒక ఉద్యోగంగానే భావిస్తానన్నారు.ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచి నీటి కొరతను తీరుస్తామన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!