Kakarla Suresh: ఉదయగిరి మండలంలో పల్లె పల్లెకు కాకర్ల.. బ్రహ్మరథం పట్టిన పల్లెవాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: ఉదయగిరి మండలంలో ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పల్లె ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, తనను గెలిపించాలని ప్రజలను కాకర్ల సురేష్ అభ్యర్థించారు. పుల్లాయపల్లెలో టీడీపీ సీనియర్ నాయకులు కే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు గజమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామస్తులందరికీ విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
ముందుగా శకునాల పల్లె వైసీపీ సీనియర్ నాయకులు కారంపూడి చెన్నకేశవులు నాయుడు.. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నబోయిన చంచల బాబు యాదవ్, ఉదయగిరి మండల అధ్యక్షులు బయన్న, తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు, సీతారాంపురం మండలం క్లస్టర్ ఇంచార్జ్ వెంగళ శెట్టి వెంకటేశ్వర్లు, జనసేన కోఆర్డినేటర్ బోగినేని కాశీ రావు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి రంగారావు, యువ మోర్చా అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జనసేన అధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాసులు, ఆల్లూరు రవీంద్ర చంద్రారెడ్డి, ప్రసన్న, అబ్రహం, జాషువా, పిడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
అనంతరం వింజమూరు మండలం కిస్తీపురం, బుక్కపురం, చింతలపాలెం, చంద్రపాడియా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవి ఒక ఉద్యోగంగానే భావిస్తానన్నారు.ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచి నీటి కొరతను తీరుస్తామన్నారు.
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!