Vizag: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి.. ఆ కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది.
నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. కాకాణి ఇంట్లో లేకపోవడంతో గేట్ కు నోటీసులు అంటించిన పోలీసులు.. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా కాకాణి గోవర్థన్ రెడ్డిని చేర్చిన పోలీసులు..
శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ పెషేంట్ తో హోం మంత్రి అనిత విడియో కాల్ మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పారు. మంత్రి అనిత మాట్లాడుతూ.. ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదన్నారు. లతశ్రీని బాధపడొద్దని.. పిల్లలున్నారని.. మీకు మేమంతా అండగా ఉంటామని మంత్రి అనిత చెప్పారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కుటుంబ సభ్యులు అండగా…
ఆంధ్రప్రదేశ్ లో పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే p4 కార్యక్రమం ఉండేది కాదన్నారు. నాలో సరైన సత్తా లేక ఓట్లు చీలిపోతాయని చంద్రబాబుకు మద్దతు పలికానన్నారు. ఈ ఉగాది చరిత్రలోనే మిగిలిపోతుంది. ఏదో ఒక సహాయం.. అది మాట సాయం అయినా చేసే వారు కావాలి.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం…
ఏపీలో పేదరిక నిర్మూలన నా జీవిత లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దాని కోసమే చివరి వరకు పనిచేస్తానన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల చేసే పనుల వల్ల పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం చేపట్టే పనుల వల్ల పేదలకు మేలు చేకూర్చాలని నా ఆశయం. స్వర్ణ భారత్ ట్రస్ట్ మాదిరి అనేక సంస్థలు పనిచేయాలి. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్య నాయుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో విలువలు ఉన్న…
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్న మెడికల్ విద్యార్థి అంజలి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు. అంజలి బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇంప్రూవ్ మెంట్ ఛాన్స్ తక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. రాజమండ్రి కిమ్స్ హాస్పటల్లో వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. అంజలి వేకురోనీమ్ అనే పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ పై ఉందని వివరించారు. Also…
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసాధ్యాలే అని ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.