Somireddy: పోలీసుల కళ్లుకప్పడంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు..
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి ఆగ్రహం..
- జగన్ కూడా అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లాడు కానీ కాకాణి మాత్రం దొరకడం లేదు..
- పోలీసుల కళ్లుకప్పడంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు: సోమిరెడ్డి
Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకును కొల్లగొట్టిన మెహుల్ ఛోక్సిని బెల్జియంలో అరెస్టు చేశారు.. ఉగ్రవాదానికి ఊతమిచ్చిన తహావుర్ రాణాను కూడా అరెస్ట్ చేసి విదేశాల నుంచి పట్టుకొచ్చారు.. కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం దొరకడం లేదు.. వీరిద్దరి కంటే ఘనుడు కాకాణి.. పోలీసుల కళ్ళు కప్పడంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు అని ఆరోపించారు. కాకాణి ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు.. జగన్ కూడా అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లాడు కానీ కాకాణి మాత్రం దొరకడం లేదన్నారు. పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అతడు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు.. దోపిడీలు దొంగతనాలు తప్పుడు కేసులు పెట్టించడంలో కాకాణి నెంబర్ వన్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Tollywood Actress : హీరోయిన్స్ కెరీర్ కు విలన్స్ గా మారుతున్న యంగ్ హీరోలు
Also Read
ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో నాపై 17 కేసులు పెట్టారు అని టీడీపీ నేత చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వాటిని ధీటుగా ఎదుర్కుంటా.. కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పు చేయలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దోపిడీదారుని వెనకేసుకొనిరావడం సరికాదు అన్నారు. ఇలాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షునిగా పెట్టడం సిగ్గుచేటు.. రుస్తుం మైన్స్ లో వందల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు. బెదిరింపులకు, కేసులకు భయపడను అని ప్రగల్భాలు పలికారు.. పోలీసులు వచ్చి అరెస్టు చేసుకోవచ్చని చెప్పారు.. తీరా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పారిపోయాడు.. గతంలో నాకు విదేశాలలో ఆస్తులు బ్యాంకు ఖాతాలో ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు.. అప్పుడు కూడా కాకాణి పారిపోయాడు.. ఇప్పుడు కూడా పారిపోయాడు అని పేర్కొన్నారు. కాకాణి కోసం ఆరు బృందాలు వెతుకుతున్నాయి.. ఇలాంటి పిరికిపంద.. పట్టపగలు దోపిడీ చేసే దొంగకు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు వత్తాసు పలకడం ఎంత వరకూ సబబు అన్నారు. కాకాణికి దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!