TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు..
- వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ..
- ఎస్పీ హర్షవర్థన్ రాజుకు ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి..
- కరుణాకర్ రెడ్డిపై పలు సెక్షన్లు కింద కేసు పెట్టాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలిసులను లిఖితపూర్వకంగా కోరారు భాను ప్రకాష్ రెడ్డి.
Read Also: Mallu Bhatti Vikramarka: మహిళా అభివృద్ధే లక్ష్యం.. స్త్రీ సమ్మిట్ 2.0లో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
ఇక, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎస్వీ గోశాలపై అసత్య, అబద్దపు ప్రచారాన్ని చేశారు.. కరుణాకర్ రెడ్డి దృష్టికి లోపం ఉంది ఏమో.. ఇష్టం వచ్చినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు.. నోరు ఉంది కధ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయామని కోరాం.. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి.. గతంలో మేము వైసీపీ హాయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని తేల్చి చెప్పారు. వైసీపీ హాయంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Crime News: దుబాయ్లో దారుణం.. పాకిస్తానీ చెతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు హత్య
ఇక, టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైసీపీ చేసినా అక్రమాల అన్నిటి పైనా చర్యలు తీసుకుంటుందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదు.. అందరి అవినీతిని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. నేను లోకల్ లే టీటీడీలో ఆయన కంటే ఎక్కువ సమాచారం నా దగ్గర ఉంటుంది.. భవిష్యత్తులో టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసినా, మాట్లాడినా ఏ స్దాయి వ్యక్తి పైనా అయినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం.. ఆ దిశగా బోర్డులో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!