TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలు..
- వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైన టీటీడీ..
- ఎస్పీ హర్షవర్థన్ రాజుకు ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి..
- కరుణాకర్ రెడ్డిపై పలు సెక్షన్లు కింద కేసు పెట్టాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలిసులను లిఖితపూర్వకంగా కోరారు భాను ప్రకాష్ రెడ్డి.
Read Also: Mallu Bhatti Vikramarka: మహిళా అభివృద్ధే లక్ష్యం.. స్త్రీ సమ్మిట్ 2.0లో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
ఇక, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఎస్వీ గోశాలపై అసత్య, అబద్దపు ప్రచారాన్ని చేశారు.. కరుణాకర్ రెడ్డి దృష్టికి లోపం ఉంది ఏమో.. ఇష్టం వచ్చినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారు.. నోరు ఉంది కధ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయామని కోరాం.. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి.. గతంలో మేము వైసీపీ హాయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయట పెట్టామని తేల్చి చెప్పారు. వైసీపీ హాయంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Crime News: దుబాయ్లో దారుణం.. పాకిస్తానీ చెతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు హత్య
ఇక, టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వైసీపీ చేసినా అక్రమాల అన్నిటి పైనా చర్యలు తీసుకుంటుందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదు.. అందరి అవినీతిని బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. నేను లోకల్ లే టీటీడీలో ఆయన కంటే ఎక్కువ సమాచారం నా దగ్గర ఉంటుంది.. భవిష్యత్తులో టీటీడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసినా, మాట్లాడినా ఏ స్దాయి వ్యక్తి పైనా అయినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం.. ఆ దిశగా బోర్డులో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!