Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసింది. కాడెడ్లతో నాగలి పట్టుకొని మంత్రి అనిత పొలం దున్నింది.
BJP MP Laxman: ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ అన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధాని మోడీ.. వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు…
Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు.
మారాయ్... రూల్స్ మారిపోయాయ్..... ఇకనుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిలెక్కి కూర్చుంటే... వాళ్ళ పాపాలను మోస్తూ.... బరువును భరిస్తూ తొక్కడానికి మేం సిద్ధంగా లేమని అంటున్నారట టీడీపీ పెద్దలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్ళకు కొత్త కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అది వైసీపీ నుంచి కావచ్చు. ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు... టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందేనని అంటున్నారట.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో గెలిచింది జనసేన. ఇక కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో... కీలకంగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అంతవరకు బాగానే ఉంది. కానీ, రానురాను ఆయన వైఖరి మాత్రం జనసైనికులకు నచ్చడం లేదట. వేదికల మీద ఆయన నవ్వుతూ సమాధానాలు చెబుతున్నా... మాకు మాత్రం కాలిపోతోందని నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం అంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ గెలిచింది...
ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ ముఖ్యమంత్రి జగన్పై కౌంటర్ ఎటాక్కు దిగారు మంత్రి నారా లోకేష్.. జగన్ గారు మీ కపటత్వానికి నాకు నవ్వు వస్తోందన్న ఆయన.. "నాకు కాలేజీ లైఫ్ ఉంది.. మీకు జైలు జీవితం ఉంది".. "నాకు క్లాస్మెట్స్ ఉన్నారు... మీకు జైలుమెట్లు ఉన్నారు.." అర్థమైందా రాజా? అంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (A.P.P.S.C.).. ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ.. అయితే, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం చేపట్టిన ఏపీపీఎస్సీ.. నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. రిజల్ట్స్ను APPSC వెబ్సైట్లో పెట్టింది.