Minister Kollu Ravindra: రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
- జగనే ఇప్పుడు కోర్టు తేదీలను తప్పించుకుంటూ తిరుగుతున్నారు..
- జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారు.. ఇలాగే, కొనసాగితే 11 నుంచి 1కి పడిపోతారు..
- రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా: మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా.. సినిమా డైలాగులు చెబితే తప్పేంటని నీసిగ్గుగా మాట్లాడుతున్నారు.. జగన్ విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారు.. ఇలానే ఉంటామంటే 11 నుంచి ఒకటికి పడిపోవడం ఖాయం అని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు జగనే వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు.. చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించారు. అధికారంలో ఉండగా మాపై జగన్ పెట్టించినవి అక్రమ కేసులని నిరూపించుకోలేదా?.. కేసులపై ఇప్పుడెందుకు నీతి కబుర్లు చెబుతున్నారు? అని అడిగారు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు.. చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే సహించేది లేదు అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read Also: Minister Anagani: 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్-1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఇక, దాడులతో విర్రవీగిన వ్యక్తులందరికీ నాడు జగన్ అందలమెక్కించారు అని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఇప్పుడు తీరు మార్చుకోకుండా బియ్యం దోచుకున్న పేర్ని నానితో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు.. దోపిడీదారులు, దొంగలు వచ్చి నీతి కబుర్లు చెబుతుంటే బాధనిపిస్తుంది.. ఏడాదిగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉంది.. వైసీపీ నేతలకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు.. అందుకే, ఎక్కడ చూసిన అల్లర్లు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అరాచక వాదులకు అసలు మాట్లాడే హక్కు లేదు.. సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతున్నాం.. సర్వ నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నాం.. ఈ నెలలో అన్నదాత శ్రీకారం చుట్టపోతున్నాం.. వచ్చే నెలలో ఉచిత బస్సు పథకం అమలవుతుంది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం.. రికార్డు స్థాయిలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అందించామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!