Minister Kollu Ravindra: రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
- జగనే ఇప్పుడు కోర్టు తేదీలను తప్పించుకుంటూ తిరుగుతున్నారు..
- జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారు.. ఇలాగే, కొనసాగితే 11 నుంచి 1కి పడిపోతారు..
- రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా: మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా.. సినిమా డైలాగులు చెబితే తప్పేంటని నీసిగ్గుగా మాట్లాడుతున్నారు.. జగన్ విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారు.. ఇలానే ఉంటామంటే 11 నుంచి ఒకటికి పడిపోవడం ఖాయం అని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు జగనే వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు.. చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించారు. అధికారంలో ఉండగా మాపై జగన్ పెట్టించినవి అక్రమ కేసులని నిరూపించుకోలేదా?.. కేసులపై ఇప్పుడెందుకు నీతి కబుర్లు చెబుతున్నారు? అని అడిగారు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు.. చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే సహించేది లేదు అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read Also: Minister Anagani: 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్-1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
ఇక, దాడులతో విర్రవీగిన వ్యక్తులందరికీ నాడు జగన్ అందలమెక్కించారు అని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఇప్పుడు తీరు మార్చుకోకుండా బియ్యం దోచుకున్న పేర్ని నానితో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు.. దోపిడీదారులు, దొంగలు వచ్చి నీతి కబుర్లు చెబుతుంటే బాధనిపిస్తుంది.. ఏడాదిగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉంది.. వైసీపీ నేతలకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు.. అందుకే, ఎక్కడ చూసిన అల్లర్లు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అరాచక వాదులకు అసలు మాట్లాడే హక్కు లేదు.. సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతున్నాం.. సర్వ నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నాం.. ఈ నెలలో అన్నదాత శ్రీకారం చుట్టపోతున్నాం.. వచ్చే నెలలో ఉచిత బస్సు పథకం అమలవుతుంది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం.. రికార్డు స్థాయిలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అందించామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!