Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
ఏపీకి మళ్ళీ వర్ష సూచన…
ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ,రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి… -
ఏపీలో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర.. లీటర్ రూ.102.47
ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. మరోవైపు పెట్రోల్ బాదుడు ఆగడంలేదు.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల పుణ్యమా అని.. కొంత కాలం పెట్రో బాదుడుకు బ్రేక్ పడగా.. ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి ప్రారంభమైంది… ఇక, ఆంధ్రప్రదేశ్లోనూ సెంచరీ దాటేసింది పెట్రోల్ ధర… విజయవాడలో పెట్రోల్ ధర మండిపోతోంది.. బెజవాడలో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీటర్కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధర రూ.102.47కు పెరిగింది.. ఇక, లీటర్ డీజిల్ ధర… -
కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సర్కార్ రేడీ.. టాస్క్ఫోర్స్ ఏర్పాటు..
ఓవైపు కరోనా సెకండ్ వేవ్లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్పై హెచ్చరికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తం అవుతోంది.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది సర్కార్.. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అలర్ట్ అయిన సర్కార్.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది.. మూడో దశలో చిన్న… -
గుంటూరు జిల్లాలో సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 100.06 కు చేరింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇంకా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. -
చిత్తూరు జిల్లాలో ఆంక్షలు మరింత కఠినం.. జూన్ 15 వరకు కర్ఫ్యూ
ఏపీలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మరో రెండు, మూడు జిల్లాల్లో మాత్రం అదుపులోకి రావడం లేదు.. అందులో చిత్తూరు జిల్లా ఒకటి.. దీంతో.. జిల్లాలో జూన్ 15వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ లో కోవిడ్ నియంత్రణపై మీడియాతో మాట్లాడారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, నారాయణస్వామి.. చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు పెద్దిరెడ్డి.. ఉదయం 6… -
ఏపీలో మరో రెండు వారాలు కర్ఫ్యూ..!
మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ పొడిగించే ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వమించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సమీక్షా సమావేశంలోనే కర్ఫ్యూ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. మే 31 తర్వాత క్రమంగా కొన్ని మినహాయింపులు ఇవ్వడం లేదా యథాస్థితిని కొనసాగించడమా? అనే దానిపై సోమవారం… -
కృష్ణపట్నంలో హై డ్రామా.. మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య..!
కరోనా మందు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు ఎంత పేరు తెచ్చిందో.. అన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.. ఆయన తయారు చేస్తున్న కరోనా మందుపై తేల్చేపనిలో ఉన్న ప్రభుత్వం.. అదే సమయంలో.. ఆయనకు భద్రత కల్పించి.. ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం.. ఆయనకు కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే ఉంటానని చెప్పారు..… -
అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షలు.. ఇప్పటికే 78 మందిని గుర్తించిన సర్కార్
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పో్యి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి పేర్లతో రూ.10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, అందులో భాగంగా.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ఇప్పటి వరకు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్లపై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన… -
కరోనా ఎఫెక్ట్.. ఏపీలోని ఆ జిల్లాలో 2 రోజులు సంపూర్ణ లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది.. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించగా.. కొత్త కేసులు కంట్రోల్ కాకపోవడంతో.. కర్ఫ్యూను మరింత టైట్ గా అమలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. తాజాగా, కరోనా కేసుల కట్టడికి అనంతపురం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది…… -
ఆనందయ్య మందుపై రేపే తుది నివేదిక… సోమవారం అనుమతి..!
కోరోనా మహమ్మారిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ముగిసింది… నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.. ఆ మందుపై ఆయుష్ కమిషనర్ రాములు వివరాలు తెలియజేశారు.. ఇప్పటికే ఆనందయ్య మందు పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయన్న ఆయన.. రేపు చివరి నివేదిక రానుందన్నారు.. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, కేంద్రం సంస్థ సీసీఆర్ఏ అధ్యయన నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం…
తాజావార్తలు
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!