ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కార్పోరేషన్కు సంబందించి కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 47 డివిజన్లకు గాను మూడు డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన మూడు డివిజన్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 20 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 18 చోట్ల వైసీపీ విజయం సాధించగా, రెండు చోట్ల టీడీపి విజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో 40కి పైగా డివిజన్లు కైవసం చేసుకుంటామని వైసీపీ…
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్లో స్పష్టంచేసింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ప్రకటించింది. ఆర్చి నుంచి వడ్లపూడి నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం…
గుంటూరు : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని ఇవాళ దర్శించుకున్నారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్వేది రధం ధగ్ధం కేసులో ఇంత వరకు పురోగతిలేదని.. రామతీర్ధం ఘటనలో ఇంత వరకు ఏవిధమైన చర్యలూ లేవని తెలిపారు. అదే అంతర్వేదిలో చర్చిపై రాయిపడితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపారని… జగన్ ప్రభుత్వ ప్రధాన అజెండా క్రిష్టియానిటీని డెవలప్ చేయడమే…
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 74,820 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 2,174 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,737 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు సజ్జల.. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీసిన ఆయన.. ఇక, టీడీపీ…
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో విచారణ చాలా కాలం ముందుకు సాగడంలేదనే విమర్శలు వచ్చాయి.. అయితే, ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి.. ఆ కేసు పర్యవేక్షణ అధికారి సుధాసింగ్ను మార్చేసింది సీబీఐ.. ఈ మార్పు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాచ్మాన్ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు సీబీఐ అధికారులు.. ఇక, న్యాయమూర్తి సమక్షంలో రంగయ్య ఇచ్చిన వాగ్మూలంతో సంచలన విషయాలు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాస్త ముందడుగు పడింది.. ఈ కేసులో వాచ్మన్ రంగయ్య తన స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటపెట్టారు.. అయితే, రంగయ్య వ్యాఖ్యలపై స్పందించారు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి.. అసలు వాచ్ మెన్ రంగయ్యతో నాకు పరిచయమే లేదన్న ఆయన.. నేను ఎవరిని బెదిరించలేదన్నారు… కడప, పులివెందులలో బెదిరించినట్లు నాపై కేసులు కూడా ఎక్కడా లేవు?…
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం.. ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా మురళీధర్రెడ్డి, కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా చెవ్వూరి హరికిరణ్ ను బదిలీ చేశారు.. ఇక, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయచంద్ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా డాక్టర్ మల్లికార్జున్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్గా ఎం హరిజవహర్లాల్ను బదిలీ చేసిన ఏపీ సర్కార్.. విజయనగరం జిల్లా కలెక్టర్గా సూర్యకుమారి, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్…
అర్బన్ స్థానిక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవాలని సూచింది.. 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్ పర్సన్ల ఎన్నిక ప్రక్రియ జరపాలని ఆదేశించిన ఎస్ఈసీ.. ఈ నెల 26వ తేదీలోగా సభ్యులకు సమాచారం…