స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, పాలిటెక్నిక్లు, ఐటీఐలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండాలని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న ఆయన.. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐవోటీ లాంటి అంశాల్లో స్కిల్ కాలేజీల్లో బోధన, శిక్షణ ఉండాలన్నారు.. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు, వర్క్ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఉండాలని..…
ఇంట్లో ఒంటరిగా రెండు మూడు రోజులు ఉండాలంటేనే భయపడిపోతాం. అలాంటిది అడవిలో ఎవరూ తోడు లేకుండా నివశించాలంటే ఇంకేమైనా ఉన్నదా? ఎటు నుంచి ఏ పాము వస్తుందో, కౄరమృగం వచ్చి చంపేస్తుందో అని భయపడిపోతుంటాం. కాని, ఆమె అలా భయపడలేదు. ఒకటి కాదు రెండు కాదు 70సంవత్సరాల నుంచి అడవిలో ఒంటరిగా నివశిస్తోంది. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలంలోని పెదకాద అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉన్నది. ఆ అడవిలో…
అమరావతి. ఆంధ్రుల ఆశాకిరణంగా నిలిచిన నగరం. నిలుస్తుందని అనుకున్న పట్టణం. కానీ.. రాజకీయాల్లో చిక్కుకుని.. భవిష్యత్తు ఏంటో తెలియక సతమతమవుతున్న నగరం. ఇందులో.. ఎవరినీ తప్పుబట్టడం కానీ.. మంచి అనడం కానీ.. ఎంత మాత్రం లేదు. కానీ.. లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో తెలియక.. నిత్యం అక్కడ దీక్షల పేరుతో పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతుల భవిష్యత్తు ఏంటి.. అన్నదే ఇక్కడ చర్చనీయాంశం. గతంలో టీడీపీ ఉన్నప్పుడు భూములు సేకరించింది. అమరావతిపై ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ప్రచారం చేసింది. దేశానికే…
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఒడిషా తీరాన్ని ఆనుకుని గంటకు 5కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతుంది. ఒడిషాలోని చాంద్ బలి దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ,తెలంగాణాలపై ఉండనున్నట్లు వాతావరణ శాఖా అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు రోజులుగా ముసురు ముసుగులో ఉన్న విహాయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గంటకు 45-55కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 78,226 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 43,222 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 45,553 శాంపిల్స్ను పరీక్షించగా, 1,190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,29,985 కి చేరింది. ఇందులో 20,00,877 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో…
ఓ ఐదేళ్ల క్రితం అక్కడ ఫ్లై ఓవర్ వస్తుందంటే అందరూ గగ్గోలు పెట్టారు.అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకోవడంతో ఫ్లై ఓవర్ కాస్తా బైపాస్ గా మారింది. కట్ చేస్తే మళ్లీ సీన్ రిపీట్ అవుతోంది. ఇదే స్థానిక అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడిపోయారట. ఇంతకీ ఎచ్చెర్ల వైసీపీ నేతల్లో బైపాస్ కలవరానికి కారణమేంటి ? శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో ఇప్పుడు రాజకీయమంతా బైపాస్…
ఏడుకొండలు ఎక్కాలంటే వాళ్ళ ప్రాపకం వుండాల్సిందేనా ? కోవిడ్ నిబంధనల పేరుతో తిరుమలలో ఆంక్షలు పెరిగిపోతున్నాయా? ఆపద మొక్కులవాడిని అలిపిరి వద్దే వేడుకుని వెనుతిరగాలా? దర్శనం కావాలంటే శ్రీవారి అనుగ్రహం ఒక్కటి సరిపోదా? ఆపదమొక్కులవాడు. కోరిన వారి కోర్కెలు ఇట్టే తీర్చే దేవుడిగా పేరొందిన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. స్వామి వారి దర్శనార్దం అలిపిరి వద్దకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఆంక్షలు వుండవు. టిటిడి చెబుతున్నట్లు సప్తగిరులు పవిత్రమైనవే. అడుగడుగునా…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది. ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13…
ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ…