తెలుగుదేశం.. ప్లాన్ బీ అమలుకు సిద్ధమైంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది.
ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13 నుంచి.. అంటే రేపటి నుంచే.. మరో ఆందోళనకు టీడీపీ శ్రీకారం చుట్టింది. లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో.. పార్టీ శ్రేణులను పోరాట పథంలోకి తీసుకువెళ్తోంది. రైతు సమస్యలే ప్రాతిపదికగా.. తాజా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మీడియాకు వెల్లడించారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
మొత్తంగా 5 రోజులపాటు.. 25 నియోజకవర్గాల్లో.. పోరాటాన్ని ప్లాన్ చేశారు. 13న ఉత్తరాంధ్ర, 14న రాయలసీమ, 15న ఉభయ గోదావరి జిల్లాలు, 16న దక్షిణ కోస్తా.. చిత్తూరు జిల్లాలు, 17న సెంట్రల్ ఆంధ్రా పరిధిలోని ప్రాంతాల్లో రైతుల కోసం.. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడనున్నట్టు అచ్చెన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి.. రైతు కోసం తెలుగుదేశం.. అని పేరు పేట్టినట్టు ఆయన ప్రకటించారు.
ఒక వైపు.. ప్రధాన సమస్యలపై ప్లాన్ ఏ లో భాగంగా లోకేశ్ ను జనాల్లోకి పంపించడం.. మరోవైపు.. ప్లాన్ బి అమలులో భాగంగా ఇలాంటి సమస్యలపై శ్రేణులన్నిటినీ ముందుకు తీసుకువెళ్లడం చూస్తుంటే.. రాను రాను టీడీపీ నాయకత్వం మరింత ప్రభావవంతగా.. ప్రజాపోరాటాలు చేయనుందని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సైతం.. తగ్గట్టుగానే స్పందించడం ఖాయం.
ఈ లెక్కన.. ముందుందు.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల జడివాన ఖాయమని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికలే ఇందుకు ప్రాతిపదిక అని విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!