అది రాదని తెలుసు.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు.
తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ సారి.. ఆంధ్రప్రదేశ్ కు తోడు.. ఛత్తీస్ గఢ్, జార్ఖంఢ్ నూ లైన్ లోకి తెచ్చారు. పదేళ్ల పాటు ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. అంతే కాదు.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపైనా అభ్యంతరం తెలియజేస్తూ.. త్వరగా సంబంధిత పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
అంతా బానే ఉంది. అక్కడ కేంద్రం.. హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం.. ప్రజలకు హామీ ఇచ్చింది.. 20కి పైగా ఎంపీ సీట్లను ఇస్తే హోదా తెస్తామని చెప్పింది. ఆ మాట కోసమైనా పోరాటాన్ని చేస్తున్నట్టుగా.. ఇలాంటి సందర్భాలను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో మధ్యలో జనాలే.. ప్రేక్షకులుగా మిగలాల్సి వస్తోంది. కేంద్రమే.. ఈ విషయమై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
గతంలో తెలుగుదేశం.. బీజేపీతో కలిసి పని చేసినప్పుడు కూడా.. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో అయోమయం నెలకొంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా.. కేంద్రం అదే అయోమయ వైఖరి కొనసాగిస్తోంది. ప్రజలకు ఏదైనా విషయాన్ని దాగుడుమూతలు లేకుండా చెబితే.. వాళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇలా.. అయోమయ స్థితిని కొనసాగిస్తే.. భవిష్యత్తుపై ప్రజలు గందరగోళంలో పడాల్సి వస్తుంది.
ఈ విషయంలో.. కేంద్రమే స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక హోదా రాదు.. మేం ఇచ్చేది లేదు.. ఎవరూ అడగొద్దు.. అడిగినా ఫలితం ఉండదు.. అన్నంత స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప.. ఈ గందరగోళానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?