అది రాదని తెలుసు.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు.
తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ సారి.. ఆంధ్రప్రదేశ్ కు తోడు.. ఛత్తీస్ గఢ్, జార్ఖంఢ్ నూ లైన్ లోకి తెచ్చారు. పదేళ్ల పాటు ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. అంతే కాదు.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపైనా అభ్యంతరం తెలియజేస్తూ.. త్వరగా సంబంధిత పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
అంతా బానే ఉంది. అక్కడ కేంద్రం.. హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం.. ప్రజలకు హామీ ఇచ్చింది.. 20కి పైగా ఎంపీ సీట్లను ఇస్తే హోదా తెస్తామని చెప్పింది. ఆ మాట కోసమైనా పోరాటాన్ని చేస్తున్నట్టుగా.. ఇలాంటి సందర్భాలను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో మధ్యలో జనాలే.. ప్రేక్షకులుగా మిగలాల్సి వస్తోంది. కేంద్రమే.. ఈ విషయమై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
గతంలో తెలుగుదేశం.. బీజేపీతో కలిసి పని చేసినప్పుడు కూడా.. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో అయోమయం నెలకొంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా.. కేంద్రం అదే అయోమయ వైఖరి కొనసాగిస్తోంది. ప్రజలకు ఏదైనా విషయాన్ని దాగుడుమూతలు లేకుండా చెబితే.. వాళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇలా.. అయోమయ స్థితిని కొనసాగిస్తే.. భవిష్యత్తుపై ప్రజలు గందరగోళంలో పడాల్సి వస్తుంది.
ఈ విషయంలో.. కేంద్రమే స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక హోదా రాదు.. మేం ఇచ్చేది లేదు.. ఎవరూ అడగొద్దు.. అడిగినా ఫలితం ఉండదు.. అన్నంత స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప.. ఈ గందరగోళానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!