భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు: టీడీపీ నేత అనురాధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్తో రోజా తమ మేడమ్పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
Read Also: నారా భువనేశ్వరికి రోజా కౌంటర్
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
చిత్తూరు జిల్లాలో వరదలు వస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ మేడమ్ భువనేశ్వరి స్వయంగా స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బాధితులకు సహాయం అందించారని అనురాధ వెల్లడించారు. భువనేశ్వరి తన వంతుగా రూ.49 లక్షలు ఆర్థిక సహాయం చేశారని గుర్తుచేశారు. అలాంటి మనిషిని అభినందించాల్సింది పోయి విమర్శించడానికి రోజాకు సిగ్గుండాలన్నారు. రోజాకు భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కరోనా సమయంలోనూ భువనేశ్వరి బాధితులకు సహాయం అందించారని.. రోజా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కనీసం స్పందించలేదన్నారు. మహిళా అధికారులను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హెరాస్ చేస్తుంటే రోజా మాట్లాడలేదన్నారు. వనజాక్షి మాటను ఇంకా ఎన్నాళ్లు రోజా వాడుకుంటుందని అనురాధ ప్రశ్నించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు ఏం అనకపోతే స్వయంగా మీడియా సాక్షిగా ఎందుకు క్షమాపణలు చెప్పారని రోజాను అనురాధ నిలదీశారు. జగన్ను పొగడటం తప్ప ప్రజల గురించి ఏనాడైనా రోజా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
అధికారం కోసం తల్లిని, చెల్లిని వీధి వీధినా తిప్పి.. అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేసిన జగన్ రెడ్డి కంటే మహిళా ద్రోహి దేశంలో ఎవరున్నారు రోజా రెడ్డీ.? – టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @AnuradhaTdp మీడియా సమావేశం. https://t.co/NqnB8esmqL
— Telugu Desam Party (@JaiTDP) December 21, 2021
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..