భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు: టీడీపీ నేత అనురాధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్తో రోజా తమ మేడమ్పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
Read Also: నారా భువనేశ్వరికి రోజా కౌంటర్
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
చిత్తూరు జిల్లాలో వరదలు వస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ మేడమ్ భువనేశ్వరి స్వయంగా స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బాధితులకు సహాయం అందించారని అనురాధ వెల్లడించారు. భువనేశ్వరి తన వంతుగా రూ.49 లక్షలు ఆర్థిక సహాయం చేశారని గుర్తుచేశారు. అలాంటి మనిషిని అభినందించాల్సింది పోయి విమర్శించడానికి రోజాకు సిగ్గుండాలన్నారు. రోజాకు భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కరోనా సమయంలోనూ భువనేశ్వరి బాధితులకు సహాయం అందించారని.. రోజా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కనీసం స్పందించలేదన్నారు. మహిళా అధికారులను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హెరాస్ చేస్తుంటే రోజా మాట్లాడలేదన్నారు. వనజాక్షి మాటను ఇంకా ఎన్నాళ్లు రోజా వాడుకుంటుందని అనురాధ ప్రశ్నించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు ఏం అనకపోతే స్వయంగా మీడియా సాక్షిగా ఎందుకు క్షమాపణలు చెప్పారని రోజాను అనురాధ నిలదీశారు. జగన్ను పొగడటం తప్ప ప్రజల గురించి ఏనాడైనా రోజా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
అధికారం కోసం తల్లిని, చెల్లిని వీధి వీధినా తిప్పి.. అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేసిన జగన్ రెడ్డి కంటే మహిళా ద్రోహి దేశంలో ఎవరున్నారు రోజా రెడ్డీ.? – టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @AnuradhaTdp మీడియా సమావేశం. https://t.co/NqnB8esmqL
— Telugu Desam Party (@JaiTDP) December 21, 2021
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!