కరోనా తరువాత విశాఖలో విమానయాన రంగం సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్, స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. జనవరి 1 నుంచి విశాఖ-తిరుపతి, కోల్కతా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు నడవబోతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 29 నుంచి విశాఖ-సింగపూర్ మధ్య స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
Read: నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన…
దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలను విమానయాన సంస్థలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సర్వీసులను విమానయాన సంస్థలు నిలిపివేశాయి. దేశీయంగా సర్వీసులు నడుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు సర్వీసులను నిలిపివేశారు. కాగా, ఇప్పుడు కరోనా కేసులు తగ్గిపోవడంతో వీటిని తిరిగి పునరుద్దరించారు.