నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూతురుగా నారా భువనేశ్వరి పై గౌరవం ఉందని.. అనని మాటలు గురించి మాట్లాడి.. ఆ గౌరవాన్ని చెడగొట్టు కోకండంటూ కౌంటర్ ఇచ్చారు. ఎవరి పాపాన ఎవరు పోయారో అందరికీ తెలుసని… చంద్రబాబు చేసిన పాపలకు పోయిన ఎన్నికలలో 23 సీట్లు పరిమితం చేశారని చురకలు అంటించారు.
అసెంబ్లీ నన్ను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టించారు…ఎంతో అవమానానికి గురి చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఎంత మంది మహిళలు ఎడ్చారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు దోంగ ఏడుపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా..