Tammineni Sitaram: సభ్యులు ఎవరైనా.. ఇష్టానుసారంగా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆగస్టు నెలలో కెనడాలో జరిగే అంతర్జాతీయ స్పీకర్ల సదస్సుకు సంబంధించి శుక్రవారం నాడు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తనపై ఎప్పుడూ ఉండే విధానం ఉంటుందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కఠినంగా నిర్ణయం తీసుకోవాలని తాము గతంలోనే లోక్సభ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
Read Also: Andhra Pradesh: ఆటో నడిపిన సీఎం జగన్.. ఫోటోలు
Also Read
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని.. వారిపై చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు. వారు ఇంకా టీడీపీలోనే ఉన్నారు కదా అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లోపల కానీ ప్లకార్డుల ప్రదర్శన మంచిది కాదని ఆయన సూచించారు. అసెంబ్లీ ఎమ్మెల్యేల హక్కు అవొచ్చు కానీ ఏది పడితే అది చేస్తే ఊరుకోబోమన్నారు. సభ్యులుగా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తామని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభ్యులు సభలో మర్యాదగా వ్యవహరించాలన్న విషయం తెలుసుకోవాలన్నారు. శాసన సభ్యులు చిన్న పిల్లలు కాదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అని గ్రహించాలన్నారు. టీవీ ఛానళ్లలో ప్రసారాల వల్ల సభలో కొంతమంది సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
-
UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..