Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతో పాటు వీఆర్ పురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న గర్భిణి మహిళను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
5వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లా లోని ముమ్మిడివరం, మామిడికుదురు గ్రామాలలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
6వ బెటాలియన్ నుంచి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని లంక రేవు, టేకుచెట్టు పాలెం, ఏలూరు జిల్లాలోని కుకునూరులో వరద ప్రభావిత ప్రాంతాల నుండి 170 మంది గ్రామ ప్రజలను కుకునూర్ వద్ద సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
9వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (77 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రామచంద్రపురం అమలాపురంలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షించడం మరియు పరిశీలించడం మరియు వరద ప్రాంతాలను ఖాళీ చేయమని నిరంతరం ప్రకటించడం మరియు అభ్యర్థించడం మరియు రామచంద్రపురంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
16వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలోని రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలం అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలంలో ఆహార ప్యాకెట్లు మరియు తాగునీటి సరఫరా చేయడంతో పాటు 55 మంది గ్రామ ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత షెల్టర్లకు తరలించారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!