Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతో పాటు వీఆర్ పురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న గర్భిణి మహిళను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
5వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లా లోని ముమ్మిడివరం, మామిడికుదురు గ్రామాలలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
6వ బెటాలియన్ నుంచి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని లంక రేవు, టేకుచెట్టు పాలెం, ఏలూరు జిల్లాలోని కుకునూరులో వరద ప్రభావిత ప్రాంతాల నుండి 170 మంది గ్రామ ప్రజలను కుకునూర్ వద్ద సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
9వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (77 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రామచంద్రపురం అమలాపురంలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షించడం మరియు పరిశీలించడం మరియు వరద ప్రాంతాలను ఖాళీ చేయమని నిరంతరం ప్రకటించడం మరియు అభ్యర్థించడం మరియు రామచంద్రపురంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
16వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలోని రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలం అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలంలో ఆహార ప్యాకెట్లు మరియు తాగునీటి సరఫరా చేయడంతో పాటు 55 మంది గ్రామ ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత షెల్టర్లకు తరలించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!