Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతో పాటు వీఆర్ పురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న గర్భిణి మహిళను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
5వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లా లోని ముమ్మిడివరం, మామిడికుదురు గ్రామాలలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
6వ బెటాలియన్ నుంచి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని లంక రేవు, టేకుచెట్టు పాలెం, ఏలూరు జిల్లాలోని కుకునూరులో వరద ప్రభావిత ప్రాంతాల నుండి 170 మంది గ్రామ ప్రజలను కుకునూర్ వద్ద సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
9వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (77 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రామచంద్రపురం అమలాపురంలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షించడం మరియు పరిశీలించడం మరియు వరద ప్రాంతాలను ఖాళీ చేయమని నిరంతరం ప్రకటించడం మరియు అభ్యర్థించడం మరియు రామచంద్రపురంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
16వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలోని రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలం అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలంలో ఆహార ప్యాకెట్లు మరియు తాగునీటి సరఫరా చేయడంతో పాటు 55 మంది గ్రామ ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత షెల్టర్లకు తరలించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!