Devineni Uma: సీఐడీ నా వెంట పడుతోంది.. నా మీద ప్రేమ పుట్టిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఐడీ నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు వరుస ఫోన్లు వెళ్తున్నాయి. ఫేక్ ట్వీట్ విషయంపై మంత్రి అంబటి రాంబాబుపై చేసిన ఫిర్యాదు అంశంలో ఉమ స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు సీఐడీ ఫోన్లు చేస్తోంది. అయితే రెండు రోజులుగా సీఐడీ తనకు వరుసగా ఫోన్లు చేస్తుండటంపై దేవినేని ఉమ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడైన మంత్రి అంబటి రాంబాబును కాకుండా.. తన వెంట పడటమేంటని ఫోన్లోనే దేవినేని ఉమ సీఐడీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సీఎం జగన్ను, సజ్జలను విమర్శిస్తున్నానని సీఐడీ చీఫ్కు తనపై ప్రేమ పుట్టిందా అంటూ సీఐడీ పోలీసులను ప్రశ్నించారు.
Read Also: Chandra Babu: దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయవిచారణ జరిపించాలి
Also Read
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
దోషులను పట్టుకోకుండా సీఐడీ చీఫ్కు తనపై కోపమెందుకు వచ్చిందంటూ దేవినేని ఉమ మండిపడ్డారు. సజ్జలను ప్రశ్నించినందుకా లేదా లండన్ మందుల గురించి లేవనెత్తినందుకా అంటూ మండిపడ్డారు. తాను ఫిర్యాదు చేస్తే.. ఇంకా స్టేట్మెంట్ ఏంటంటూ ఆగ్రహించారు. దొంగను పట్టుకోకుండా తన వెంట పడతారేంటంటూ అంబటిని ఉద్దేశిస్తూ సీఐడీ పోలీసులను దేవినేని ఉమ ప్రశ్నించారు. తానేం భయపడనని రాజమండ్రి వెళ్లేందుకు తాను ప్రిపేర్ అవుతున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఐడీ తన ఫిర్యాదుపై స్పందించి అంబటిని అరెస్ట్ చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా ముందుగా మంత్రి అంబటి రాంబాబును విచారించి అరెస్ట్ చేయాలని, ఆ తర్వాత తన వాంగ్మూలం అవసరమైతే.. చట్ట ప్రకారం నోటీసులు ఇస్తే విచారణకు రావడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..