KA Paul: ఢిల్లీలో కేఏ పాల్ మౌనదీక్ష.. ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష..
హస్తిన వేదికగా ఆందోళనకు దిగారు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ ఢిల్లీలోని రాజ్ ఘాట్లో మౌనదీక్ష చేపట్టారు.. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షకు దిగిన ఆయన.. మధ్యాహ్నం 3 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.. తెలుగురాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.. విభజన హామీలు అమలు కాలేదు, అందుకే తాను రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నానని పేర్కొన్న ఆయన.. జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నా.. నాతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించాలని సూచించారు.
Read Also: Singapore Open: ఫైనల్కు దూసుకెళ్లిన తెలుగు తేజం పీవీ సింధు
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, తాను రాజ్ఘాట్లో మౌన దీక్ష చేస్తుంటే.. ఈరోజు 2.10 కోట్ల మంది నాతో పాటు ఉపవాసం ఉంటున్నారని తెలిపారు కేఏ పాల్.. విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు.. విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.. తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్న ఆయన.. అందుకే తాను పోరాటానికి దిగుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ మధ్య తెలంగాణలో పరిస్థితులపై ‘ఆరా’ నిర్వహించిన ఎన్నికల సర్వేపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడిన విషయం తెలిసిందే.. ఆరా మస్తాన్ పిచ్చిపిచ్చి సర్వేలు చేస్తే ప్రజలు ఊళ్లలో తిరగనివ్వరని హెచ్చరించిన ఆయన.. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానన తెలిపారు.. టీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీకి 30 శాతం ఓట్లు వస్తాయని మస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అసలు ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 60 శాతం ఓటు బ్యాంకు ఉందని కేఏ పాల్ పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో