Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
What’s Today: * నేడు విశాఖ, గుంటూరు జిల్లాలలో ఏపీ సీఎం జగన్ పర్యటన * నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు.. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్పై దాడికి నిరసనగా పిలుపు.. నేడు అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు * ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ * నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ * నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్.. ఉదయం… -
Off The Record About Janasena Party: ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్.. టీడీపీకి టెన్షన్.. వైసీపీ విరుగుడు మంత్రం..!
ఆంధ్రప్రదేశ్లో పెద్ద సబ్ రీజియన్స్లో ఒకటి ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంత ఓటర్ల తీర్పు ఏకపక్షమైన ప్రతీసారీ పార్టీలు అనూహ్యమైన విజయాలను కైవశం చేసుకుంటున్నాయి. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 33స్థానాలను గెల్చుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైసీపీ గాలి వీచింది. 28 చోట్ల గెలిచి… -
BRS Party: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై బీఆర్ఎస్ గురి..!
జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్ఎస్గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ… -
President Draupadi Murmu: శ్రీశైలం పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈ మధ్యే ఏపీలో పర్యటించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. పోరంకిలో గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్.. సీఎం జగన్ ఆమెకు సన్మానం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన పర్యటనలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. అయితే, ఇప్పుడు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నారు రాష్ట్రపతి.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన… -
TTD EO Dharma Reddy: టీటీడీ ఈవోకు శిక్ష విధించిన హైకోర్టు..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు శిక్ష విధించింది.. దాంతో పాటు రూ. 2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా.. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించగా, ముగ్గురిని క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే,… -
Ajay Kallam: గడువులోగా సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గడువును నేపథ్యంలో సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని.. చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సూచించారు. భూమిని కొనుగోలు చేసినప్పటికీ పట్టాలు పొందనివారు లక్షల్లో ఉన్నారని వారందరూ తమ హక్కు పత్రాలు పొందగలిగేలా ప్రభుత్వం నూతన అవకాశం ఇచ్చిందన్నారు.. సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణపై మంగళగిరి భూపరిపాలనా శాఖ ఛీఫ్ కమీషనర్ కార్యాలయం వేదికగా అన్ని జిల్లాల నుండి ఎంపికచేసిన డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు,… -
CM YS Jagan: రేపు విశాఖ, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బుధవారం రోజు విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. రేపు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. రేపు విశాఖ వెళ్లనున్న ఆయన.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్లో మాజీ మంత్రి… -
Amara Raja: ఆ ప్రచారానికి ఇలా చెక్.. ఏపీలో అమరరాజా రూ.250 కోట్ల పెట్టుబడి..
ఆంధ్రప్రదేశ్ నుంచి ‘అమరరాజా’ వెళ్లిపోయింది.. ఒక అమరరాజానే కాదు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి బైబై చెప్పేస్తున్నాయి అనే విమర్శలు వచ్చాయి.. తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమై.. తెలంగాణ సర్కార్తో ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత.. ఈ విమర్శలు మరింత పెరిగాయి.. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్న ఆ సంస్థ.. ఇందు కోసం రూ. 9,500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయిపోయింది.. దీనికి… -
Gudivada Amarnath: ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహారం.. పెట్టుబడులపై తప్పుడు ప్రచారం..
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు.. ప్రగతి గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా టీడీపీ.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. తన హయాంలో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూల్లో కేవలం రూ. 34 వేల… -
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెన్షన్ల పెంపు ఒక్కటే కాదు..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. పెన్షన్ దారులకు ఆనందాన్నిచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. రూ. 2,500 నుంచి రూ. రూ. 2,750కు పెంచేందుకు నిర్ణయించాం.. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 134 కోట్లు ఖర్చు అవుతుందని.. అయినే.. సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.. నిజం ఎలా ఉంటుందంటే.. జగన్లా ఉంటుందని…
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!