JD Lakshmi Narayana: ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ క్లారిటీ.. అక్కడి నుంచే బరిలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని గుర్తుచేసిన ఆయన.. నేను ఏపార్టీ నుంచి పోటీ చేస్తానో.. సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుందన్నారు.. అయితే, నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపే ఉంటానని స్పష్టం చేశారు.. గత ఎన్నికల్లోనే బాండ్ పేపర్ రాశాను.. తాను అనుకున్నది చేయలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పానని గుర్తుచేసుకున్నారు లక్ష్మీనారాయణ.
Read Also: CM KCR: న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు.. హైదరాబాద్ లో పోదు
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
మరోవైపు.. రెండు రాష్ట్రాలు కలవడం బాగానే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వీవీ లక్ష్మీనారాయణ.. రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో నడుస్తోంది.. అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడితే సమస్యలే ఉండబోవన్నారు.. కాగా, గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ.. కనీసం గట్టిపోటీ ఇవ్వలేకపోయారు.. టీడీపీ అభ్యర్థిపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. లక్ష్మీనారాయణ మూడోస్థానానికే పరిమితం అయ్యారు.. అయితే, ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నాను.. విజయం సాధించిన నరేంద్ర మోడీ, వైఎస్ జగన్కు అభినందనలు.. తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను కూడా ఆయన అభినందిస్తూ.. ఎన్నికల ఫలితాల తర్వాత ట్వీట్ చేసిన విషయం విదితమే.. అంతేకాదు, తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు సేవ చేసే విషయమై తనపని తాను చేసుకు వెళతానని పేర్కొన్నారు.. అయితే, ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో పోటీపై మాట్లాడడంతో.. ఈ సారి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. మరి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఈ సారైనా చట్టసభల్లో అడుగుపెడతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!