Jogi Ramesh: పవన్ పగటి వేషగాడు.. అది వారాహి కాదు.. నారాహి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. అయితే వారాహి రంగుపై విమర్శలు చెలరేగాయి. పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన వాహనానికి వారాహి అని కాకుండా నారాహి అని పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల సైకో అని ఆరోపించారు. అతడు పగటి వేషగాడు.. పిరికి సన్నాసి అని వ్యాఖ్యానించారు. పవన్ గురించి తాము మాట్లాడాలా అని ప్రశ్నించారు.
Read Also: Congress Party: ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
మరోవైపు చంద్రబాబుపైనా మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయినా దిగజారతాడని.. లోకేష్ రాజకీయ శుంఠ అని.. అజ్ఞాని అని.. పప్పు సైకో అని ఎద్దేవా చేశారు. జయహో బీసీ ట్రైలర్ చూసి టీడీపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని.. రేపటి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వైసీపీకి ఇచ్చే మద్దతు చూసి చంద్రబాబుకు మూర్ఛ వస్తుందన్నారు. గత మూడు రోజులుగా బీసీల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో జగన్ 80 వేల మంది బీసీలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు తన 14 ఏళ్ళ హయాంలో ఎంత మంది బీసీలను ప్రజాప్రతినిధులుగా చేశాడో లెక్క తీయగలడా అని నిలదీశారు. చంద్రబాబు దమ్మున్న మగాడు అయితే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే నిలబడతారని చెప్పగలరా అని సూటి ప్రశ్న వేశారు. పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉంటారని, తానే సీఎం అభ్యర్థిని అని చెప్పగలడా అని ప్రశ్నించారు. వీళ్లంతా సిగ్గులేని వాళ్లు అని.. చరిత్రలో ధీరుడిగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!