ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ఏపీ రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్ అవార్డులు సొంతం చేసుకుంది.. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్ లో అవార్డుల ప్రదానం జరిగిందని తెలిపారు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ORCMS (ఆన్ లైన్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్), రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు వచ్చాయని వెల్లడించారు.. వచ్చే నెల 20వ తేదీన ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు..
కరుడుగట్టిన నేరగాడికి పనిగట్టుకుని మరీ... పెరోల్ ఇప్పించింది ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్ను బయటికి తీసుకురావడంలో ఎవరికి ఇంట్రస్ట్ ఉంది? జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరగాడిని పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ఎలాంటి పనులు చేయించాలనుకున్నారు? పోలీస్, పొలిటికల్ పవర్స్ కలిసి అతనికి ఫేవర్ చేయాలనుకున్నాయా? ఇప్పుడీ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోబోతోందా? సిఫారసు లేఖలు ఇచ్చిన ఆ శాసనసభ్యులు ఎవరు?
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విషయంలో అసలేం జరిగింది? వరుస వివాదాల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారు? తన మీద కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెబుతున్న మాటలు కేవలం డైవర్షన్ కోసమేనా? లేక అందులో వాస్తవాలున్నాయా? సొంత టీడీపీ నేతలే ఎమ్మెల్యే కుర్చీ కింద మంట పెడుతున్నారా? అసలక్కడేం జరుగుతోంది?
కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి పిల్లి సత్తిబాబు రాజీనామా చేశారు.. మండలాధ్యక్షుడు నియామకం విషయంలో ఉదయం ఘర్షణ పడ్డారు టిడిపి కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ వర్గాలు.. ఈ వ్యవహారంలో ఆయన టీడీపీ పదవికి గుడ్ బై చెప్పడం చర్చగా మారింది..
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి... వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం.. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..
నీటికుంటలో పడి ఆరుగురు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు స్కూల్ వదిలిన తరువాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు.. నీటికుంటలో ఆడుకుంటూ జారిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. మృతులు శశికుమార్, కిన్నెరసాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ గా గుర్తించారు.