Vijayasai Reddy: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో రోజుకో రచ్చ అనే తరహాలో ఈ వ్యవహారం సాగుతోంది.. మీడియాతో మాట్లాడే సందర్భంలోనూ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు.. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లినా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరోసార పురంధేశ్వరిపై హాట్ కామెంట్లు చేశారు ఎంపీ సాయిరెడ్డి..…
ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ చరిత్ర సృష్టించాడు.. అలాంటి పాదయాత్ర ఇవాళ్టికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటుంది వైసీపీ.. అధికారంలోకి కూడా రావడంతో.. ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది..
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండులో ప్లాట్ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి అక్కడే మృతిచెందగా.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు.. ఉదయం సర్వ సాధారణంగా నెహ్రూ బస్టాండ్ రద్దీగా ఉంటుంది.. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు.
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల బైక్, ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నా.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు
సీఎం జగన్ కు విన్నవించుకుంటే మన సమస్యలు తీరతాయన్నారు.. నన్ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా తప్పించాలని చూస్తున్నారు.. ప్రతీ పార్టీలో అంతర్గత వైరుధ్యాలుంటాయని ఎస్సీ కమీషన్ ఛైర్మన్ మరుముడి విక్టర్ ప్రసాద్ వెల్లడించారు.
రాజకీయ నాయకుడివే కాదు కనుక రెంటుకు పార్టీ పెట్టావు పవన్.. పోటీ చేయలేడు కాబట్టే పవన్ పార్టీ అద్దెకు పెట్టాడు అని ఎంపీ విమర్శలు గుప్పించారు. బీసీలను ఎక్కిరించిన చంద్రబాబు బీసీ తీర్పుతోనే జైలు కెళ్ళాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.