YSR Rythu Bharosa: రైతులకు సీఎం గుడ్న్యూస్.. రేపే 53.53 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Rythu Bharosa: రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు.. ఇక, రేపటి పుట్టపర్తి పర్యటన కోసం.. మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. పుట్టపర్తి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..
Also Read
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
ఈ ఏడాది ఇప్పటికే తొలి విడత సాయాన్ని అందజేసింది ఏపీ సర్కార్.. రేపు రెండో విడత సాయాన్ని జమ చేయనున్నారు.. వైఎస్సార్ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది ఖాతాల్లోకి రూ.2,204.77 కోట్లు జమ చేయనున్నారు.. ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించింది వైసీపీ సర్కార్.. ఇక, ఇప్పుడు రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్లు అందించనుంది.. కాగా, వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో 52,57,263 మంది అర్హత పొందారు. వీరిలో 50,19,187 మంది భూ యజమానులు అయితే.. 1,46,324 మంది కౌలుదారులు, 91,752 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున తొలి విడతగా జూన్ 1వ తేదీన భూ యజమానులకు, సెప్టెంబర్ 1న కౌలుదారులు, అటవీ సాగుదారులకు రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించింది ప్రభుత్వం.. ఇక, రెండో విడతలో 53,52,905 మంది అర్హత పొందారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!