India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Zimbabwe: ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్లో టీమిండియా పరిస్థితి ‘చావు-రేవు’ అన్నట్టుగా తయారైంది. ముఖ్యంగా ఈరోజు (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ భారత జట్టు భవిష్యత్తును మాత్రమే కాదు, నలుగురు స్టార్ ఆటగాళ్ల కెరీర్ను కూడా నిర్ణయించబోతోంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో భారత్ గెలవడమే కాదు, సౌత్ ఆఫ్రికా – వెస్టిండీస్ను ఓడించాలి. ఎందుకంటే వెస్టిండీస్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. వెస్టిండీస్ వాళ్లు గెలిస్తే మన జట్టు సెమీస్ చేరడం దాదాపు అసాధ్యం.
READ ALSO: Viral Video: ఆలయ ఉత్సవంలో ‘ఏనుగు’కు ఆగ్రహం.. తొండంతో పూజారిని అంతదూరం..!
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ప్రమాదంలో ఉన్న ఆ నలుగురు స్టార్లు వీరే:
అభిషేక్ శర్మ: ఈ స్టార్ ప్లేయర్ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్మన్గా ఉన్నా, ఈ వరల్డ్ కప్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 4 మ్యాచ్ల్లో కలిపి చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే. ఇందులో మూడు సార్లు సున్నాకే అవుటయ్యాడు. ఇదే ఫామ్ కొనసాగితే మనోడి స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తిలక్ వర్మ: కీలకమైన మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ, ఆశించిన స్థాయిలో వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 107 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. మనోడి ఫామ్ ఇలాగే కొనసాగితే..తిలక్ ప్లేస్ను రీప్లే్స్ చేయడానికి శ్రేయాస్ అయ్యర్ రెడీగా ఉన్నాడు.
రింకు సింగ్: ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్కు ఈ టోర్నీలో బ్యాటింగ్ చేసే అవకాశం తక్కువగా వచ్చినా, మనోడు మాత్రం తనకు అడపాదడపా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 5 మ్యాచ్ల్లో కలిపి కేవలం 24 పరుగులే చేశాడు. దీంతో రింకు స్థానంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్): జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ సూర్య ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఆయన సగటు బాగున్నా, తన మార్కు ‘మెరుపు వేగం’ (స్ట్రైక్ రేట్) తగ్గింది. సూర్యకు ఇప్పుడు 35 ఏళ్లు. ఒకవేళ భారత్ సెమీస్ చేరకుండానే వెనుదిరిగితే, కెప్టెన్సీతో పాటు ఆయన కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే చెన్నై వేదికగా ఈ రోజు జరిగే మ్యాచ్ టీమిండియాకు అగ్నిపరీక్ష లాంటిది. ఇందులో గెలిచి సెమీస్ చేరితేనే ఈ నలుగురు ఆటగాళ్లు ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే భారత జట్టులో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తు్న్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!