Tragedy On Vacation: అన్నమయ్య జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలోని గుంజేనేరు వాటర్ ఫాల్స్ వద్ద విహార యాత్ర విషాదాంతమైంది. బీటెక్ చదువుతున్న ఆరుగురు స్నేహితులు కలిసి గిరి, సాయి దత్త, మోహన్, కేదార్, మళ్లీ, దినేష్ కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో సాయి దత్తకి ఆకస్మికంగా తీవ్ర అస్వస్థత కలగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో యువకులు దారి తప్పిపోయారు. ఈ క్రమంలో వారు శ్రీకాళహస్తిలోని తమ స్నేహితులకు…
హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ను నటుడు మోహన్బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్తో మోహన్ బాబు అన్నారు.
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.
ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గ్రామపెద్దలు
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమలో అత్యధికంగా గ్రంధాలయాలు ఉన్నాయి అందుకే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నానన్నారు. నన్ను పిఠాపురానికే పరిమితం చేస్తారని, కానీ నేను సరస్వతికి నిలయమైన రాయలసీమను ఎంచుకున్నానని ఆయన…
Nara Lokesh : శ్రీకాకుళం జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ట్రైనింగ్ అభ్యర్థులను దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్మీ ఉద్యోగాల కోసం వ్యక్తులను సిద్ధం చేయాలని కోచింగ్ సెంటర్ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి నారా లోకేష్.. బాధ్యులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో “ఇండియన్ ఆర్మీ కాలింగ్” అనే సంస్థను నడుపుతున్న వెంకట రమణ…
CM Chandrababu : నేడు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. స్వీయ క్రమ శిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సీఎం చంద్రబాబు సత్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా శనివారం బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ…
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్కు చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్కు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య.. మొత్తం చీఫ్ సహా ఆరుగురితో సిట్ను ఏర్పాటు చేసింది.
Lagacharla Industrial Park: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు.