Pawan Kalyan: కాసేపట్లో పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం..
- మరికాసేపట్లో జనసేన కేంద్ర కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం
- జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. అందుకోసం జనసేన అధ్యక్షుడు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. బడ్జెట్ పై అవగాహన.. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.
Read Also: Linguswamy : రూ.700కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న లింగుస్వామి
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
కాగా.. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ ఉంటుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై బీఏసీ లో చర్చిస్తారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు. హజారు కావాలని వైసీపీ నిర్ణయించింది. జగన్ తమ సభ్యులతో కలిసి సభకు వస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా సభకు వస్తారా లేక ఒక్క రోజుకే పరిమితమా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ప్రతి రోజు సమావేశాలకు హాజరైతే మాత్రం సభ వాడిగా వేడిగా జరగనుంది.
Read Also: Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. 8 నెలల పాలనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సభకు వివరించనున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ క్రమంలో.. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుత వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ సమీక్ష నిర్వహించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!