Nara Lokesh : శ్రీకాకుళం జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ట్రైనింగ్ అభ్యర్థులను దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్మీ ఉద్యోగాల కోసం వ్యక్తులను సిద్ధం చేయాలని కోచింగ్ సెంటర్ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి నారా లోకేష్.. బాధ్యులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో “ఇండియన్ ఆర్మీ కాలింగ్” అనే సంస్థను నడుపుతున్న వెంకట రమణ…
CM Chandrababu : నేడు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. స్వీయ క్రమ శిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సీఎం చంద్రబాబు సత్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా శనివారం బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ…
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్కు చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్కు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య.. మొత్తం చీఫ్ సహా ఆరుగురితో సిట్ను ఏర్పాటు చేసింది.
Lagacharla Industrial Park: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు.
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం…
Murder : విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలసలో వివాహిత హత్య అనుమానిస్తున్నారు. కనకల మధు లక్ష్మి భర్తే హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయవాడకు చెందిన ముని ఆదిబాబుతో తొలిత మధులక్ష్మి వివాహం జరిగింది. అతను చనిపోవడంతో లక్ష్మి తమ కొడుకుతో కలిసి తల్లిదండ్రుల ఊరు లింగలవలసకు వచ్చేసింది. ఇదే క్రమములో గ్రామములో కనకల రామారావు ను వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. లక్ష్మి తన 8 ఏళ్ల…
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా, కేజ్రీవాల్ను అధికారులు ఘనంగా స్వాగతించారు.
AP Assembly : మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు నేడు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. బి.సి. జనార్దన్ రెడ్డి – టేబుల్ ఐటెమ్ – 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 16వ వార్షిక నివేదిక, కింజరాపు అచ్చెన్నాయుడు, టేబుల్ ఐటెమ్ – 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క 46వ వార్షిక నివేదిక సమర్పించనున్నారు. Radhika Merchant: అంబానీ చిన్న కోడలి ఫన్నీ…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.