Home
Andhra Pradesh Crime
Andhra Pradesh Crime News
-
Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
Proddatur : ప్రొద్దుటూరులో ఇటీవల కలకలం రేపిన పద్మజ అనే మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో భర్తే స్వయంగా చేసిన కిరాతక హత్యగా తేలింది. నిందితుడైన కిరణ్ తన భార్యను అత్యంత క్రూరంగా ప్లాన్ చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కిరణ్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ దారుణానికి ప్రధాన కారణమైంది. తన ప్రియురాలితో కలిసి ఉండటానికి… -
Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ
తిరుపతి జిల్లాలోని తవణంపల్లి మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల కారణంగానే ఈ కిరాతక హత్య జరిగినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్తో పాటు, అతనికి సహకరించిన ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి! పోలీసుల కథనం ప్రకారం.. మోదలపల్లి గ్రామానికి చెందిన యువరాజ్ అదే… -
Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!
ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా చావు కేకలు వినిపించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వివాహేతర సంబంధం చంపేసిందా…? పోలీసుల విచారణలో ఏం తేలింది..? నిందితులు ఎవరు..? నెల్లూరు జిల్లాలో జరిగిన జంట మర్డర్స్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా గండవరం పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పదునైన రాడ్లతో వారిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో… -
Shocking Incident : సాయం చేద్దామని వెళ్తే సర్వం దోచేశారు.. అమలాపురంలో దొంగల మాయాజాలం.!
మానవత్వం ముసుగులో వచ్చి మాయమాటలతో మోసగించే ముఠాలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాయం చేయడానికి వెళ్లిన ఒక వృద్ధుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఇద్దరు యువకులు ఆయన పెన్షన్ సొమ్మును తస్కరించిన ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన చవటపల్లి సత్యనారాయణ (80) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, తన నెలవారీ పెన్షన్ సొమ్ము రూ. 20,000లను బ్యాంకు నుండి విత్ డ్రా చేసుకున్నారు. ఆయన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయం నుండే… -
Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో భర్తను కట్టుకున్న భార్య కత్తితో పొడిచి చంపిన ఘటన గురువారం నాడు రాత్రి మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. -
Nandyal: ముగ్గురు చిన్నారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
Nandyal: నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నే గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికుల సమాచారం ప్రకారం వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం సురేంద్ర… -
Tuni Rape Case: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు..!
Tuni Rape Case: తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తుని కొండ వారి పేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లెడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజక్షన్ చేయించాలని ఇప్పటివరకు మూడుసార్లు… -
Tuni Minor Rape Case: తుని అత్యాచారం కేసు.. చెరువులోకి దూకిన నిందితుడి మృతదేహం లభ్యం..
Tuni Minor Rape Case: తుని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ హాస్పటల్కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నారాయణరావుని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో… -
Ambati Rambabu: నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు..?
ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. కాబట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు?.. వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. బాధితులకు మేము అండగా ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. -
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. నంద్యాలకు చెందిన విలేఖరి కీలక పాత్ర
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..