Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. నంద్యాలకు చెందిన విలేఖరి కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు. హైదరాబాద్ లక్డీకపూల్ లోని సాయి పెయింటింగ్ ప్రెస్లో నకిలీ లేబుళ్లను తయారు చేశాడు. లేబుళ్లను ఇచ్చినందుకు ఫోన్ పే ద్వారా అల్లాబకాష్ ఖాతాలోకి నిందితులు డబ్బులు జమ చేశారు. మూడు రోజుల క్రితం ఎన్జీవో కాలనీలోని అల్లాబకాష్ ఇంట్లో సోదాలు చేసిన విజయవాడ ఎక్సైజ్ అధికారులు.. కంప్యూటర్లను సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ఏ16గా గుర్తించారు. కోర్టు అల్లాబకాష్కు 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని జైలుకు తరలించారు.
READ MORE: Gujarat Cabinet: 26 మందితో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
Also Read
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం