Vijayalakshmi Murder: నరరూప రాక్షసుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- వరసకు పిన్ని అయ్యే వృద్ధురాలిని చంపేశారు
- పక్కా ప్రణాళికతో హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayalakshmi Murder: వరసకు పిన్ని అయ్యే వృద్ధురాలిని కన్న కొడుకుతో కలిసి అత్యంత దారుణంగా హత్యకు పాల్పడిన నరరూప రాక్షసుడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఊర్మిళ నగర్కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దారుణ హత్యను గుర్తించారు.
READ ALSO: Drugs : మరో పెద్ద నెట్వర్క్ను చేధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
విజయవాడ భవానీపురం ఊర్మిళా నగర్లో పొత్తూరి విజయలక్ష్మి కుమారుడితో కలిసి ఉంటోంది. ఆమె భర్త పిచ్చయ్య ఆరేళ్ల క్రితం చనిపోయారు. గతనెల 30న చిట్టినగర్ లోని వాసవి కల్యాణమండపంలో జరిగిన పెళ్లికి వెళ్లిన విజయలక్ష్మి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో విజయలక్ష్మి కుమారుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవి ఫిర్యాదుపై పోలీసులు విజయలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో విజయలక్ష్మి దారుణ హత్యకు గురైనట్టు గుర్తించారు. విజయలక్ష్మిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి విజయవాడలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. విజయలక్ష్మి తల మొండెం ఒక చోట, కాళ్లు, చేతులు మరోచోట మురుగు కాల్వ లో సంచుల్లో దొరికాయని చెబుతున్నారు పోలీసులు…
విచారణలో విజయలక్ష్మి సోదరి కుమారుడు హనుమాన్ సుబ్రహ్మణ్యం, అతని కుమారుడు ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు. సెప్టెంబర్ 30న భవానీపురం హెచ్బీ కాలనీలో తమ ఇంటికి తీసుకెళ్లి అమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది… విజయలక్ష్మిని కళ్యాణమండపం నుంచి సుబ్రహ్మణ్యం కుమారుడు ద్విచక్రవాహనంపై HB కాలనీలోని ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే సుబ్రహ్మణ్యం మత్తుమందును ఆమె ముఖానికి అద్ది, మత్తులోకి జారుకోగానే పీకకోసి చంపేశాడు. అపై మామిడికాయలు సరికే కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఈ హత్యకు సుబ్రహ్మణ్యం కుమారుడు సహకరించాడు. శరీరభాగాలను సంచుల్లో వేసుకుని బైక్ పై బొమ్మసానినగర్లోని పరిసర ప్రాంతాల్లో పడేసి ఇంటికి తాళం వేసి పారిపోయారు. స్థానికంగా ఉన్న 900 cc కెమెరాలు పరిశీలించి నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు…
భార్య తనను విడిచి వెళ్లిందనే కోపంతో పాటు బంగారం దక్కక పోవటం, తనను మేనమామ ఇంటినుంచి వెళ్లగొట్టడానికి కారణం తన పిన్ని విజయలక్ష్మి అని సుబ్రహ్మణ్యం బలంగా నమ్మి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అందుకే ఆమెను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సుబ్రహ్మణ్యం భార్య 10 ఏళ్ల కిందట అతడిని విడిచి వెళ్లి పోయింది. ఆ సమయంలో 650 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. అప్పట్లో సుబ్రహ్మణ్యం భార్యకు విజయలక్ష్మి వత్తాసు పలికారు. బంగారం తనదేనని సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవల ఆ కేసును కోర్టు కొట్టేసింది. మేనమామ రాంబాబు వద్ద సుబ్రహ్మణ్యం పనిచేస్తూ Hb కాలనీలోని ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇల్లు తనదేనని సుబ్రహ్మణ్యం చెబుతున్నాడని రాంబాబుకు ఇటీవల విజయలక్ష్మి చెప్పారు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని రాంబాబు హెచ్చరించారు. ఈ గొడవలన్నింటికీ విజయలక్ష్మి కారణమని నమ్మిన సుబ్రహ్మణ్యం ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు..
READ ALSO: Hyderabad Fraud: కిలాడీ లేడీ.. నమ్మితే నట్టేట ముంచింది!
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!