Tadipatri: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలరి అందరికీ ధైర్యం చెప్పే పోలీసులే ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం జీర్ణించుకోలేకుండా ఉంది. పోలీసు ఉద్యోగం అంటేనే పని ఒత్తిడి..
TDP vs TDP: అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ ద్విసభ్య కమిటీ మెంబర్లు తన తండ్రిని దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బండారు శ్రావణి. నిన్న మర్తాడు గ్రామంలో యువగళం క్యాంప్ సెట్ దగ్గర బండారు శ్రావణి.. ముంటి మడుగు కేశవ రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో తన తండ్రి బండారు రవికుమార్ ను దూషించి దాడి చేశారంటూ ద్విసభ్య కమిటీ సభ్యుడు సోదరుడు శ్రీనివాసరెడ్డిపై శ్రావణి…
Man Married Minor Girl: సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.. మైనార్టీ తీరకుండానే ప్రేమలు, పెళ్లిళ్లు.. విడుపోవడాలు కూడా జరిగిపోతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. బాలికను ప్రేమిస్తున్న ఓ యువకుడిని.. ఆ బాలిక పేరెంట్స్ మందలించారు.. దీంతో.. పబ్లిక్గానే ఆ బాలికకు తాళి కట్టేశాడు.. ఈ వ్యహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్ అనంతపురం జిల్లాలో…
Police Station: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఓ దొంగ అనుమానాస్పద మృతి కేసు పోలీసులపై వేటు పడేలా చేసింది.. ఈ ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం తమకు అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు…
Andhra News: అనంతపురం నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లోని వరద పోటెత్తింది. కాలనీల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఇళ్లలోనికి నీరు ప్రవేశించి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాయదార్లపల్లి గ్రామం విద్యార్థుల లేఖ రాశారు.. మారుమూల ప్రాంతమై ఎక్కడో విసరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లోని చిట్ట చివరి గ్రామాలైన మాయదార్లపల్లి.. ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు.. కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి… ఇక, ఆ గ్రామ విద్యార్థులకు కొత్త కష్టాలు వచ్చాయి.. గత 45 రోజులుగా మాయదార్లపల్లి ఆ గ్రామ విద్యార్థులను బసాపురం…
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా ఓ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడు.. ఆ యువతి నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు… ఆ యువతిని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్నాడు.. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో… ఢీకొట్టాడు.. తర్వాత అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.. చివరకు అసలు విషయం వెలుగు చూడడంతో.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also:…
సీఎం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసి పోలీసు సేవలు మెరుగు పరిచారని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎదైనా ఘటన జరిగితే అందులో నిజానిజాలు బయటికి రావాలి అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అవసరమని, గతంలో నమూనాలను తిరుపతికి పంపేవారని గుర్తు చేసారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో త్వరితగతిన కేసులు ఛేధించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నారు. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తూ కేసులు త్వరితగతిన నమోదు…