Police Station: పీఎస్లో అనుమానాస్పద మృతి.. సీఐ సహా నలుగురు పోలీసులపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Station: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఓ దొంగ అనుమానాస్పద మృతి కేసు పోలీసులపై వేటు పడేలా చేసింది.. ఈ ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం తమకు అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు 15 గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు.. అయితే.. రామాంజనేయుులు అతని లుంగీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉండటంతో అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై అసుపత్రికి తీసుకెళ్లారు… కానీ, అప్పటికే చనిపోయాడని.. దీనిపై కేసు నమోదు చేశాం.. కొందరు డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. కాబట్టి ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు.. ఈ ఘటనలో సీఐ శ్రీనివాసులు, హోంగార్డు రమేష్, ఇద్దరు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్నలను సస్పెండ్ చేశారు.
Read Also: Minister Errabelli: ఆ..ఎమ్మెల్యేలను మారిస్తే100 సీట్లు గ్యారెంటీ.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
అయితే, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కురుబ రామాంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న గొర్రెల దొంగతనానికి వచ్చిన రామాంజనేయులు.. పైతోటవాసులకు పట్టుబడ్డాడు. ఆంజనేయులుతో పాటు మరో దొంగను చితకబాది.. పైతోటవాసులు పోలీసులకు అప్పగించారు. కానీ, పీఎస్లో అతడు మృతి చెందడం అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు కొట్టి చంపారా.. లేక ఆత్మహత్యనా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ ఫక్కీరప్ప.. రాయదుర్గం పట్టణ పోలీసుస్టేషన్ లో దొంగ ఆత్మహత్య చేసుకున్న కంప్యూటర్ గదిని పరిశీలించిన ఆయన.. సిబ్బంది నిర్లక్ష్యంగా స్పష్టంగా కనబడుతోందన్నారు.. బ్యారెక్ లో ఉండాల్సిన ఇద్దరు దొంగలను కంప్యూటర్ గదిలో ఎందుకు ఉంచారని ఆరా తీశారు.. ఘటనప్తె విచారణాధికారిగా అనంతపురం ఇంఛార్జ్ డీఎస్పీ మహబూబ్ బాషాను నియమించారు.. ఎన్ హెచ్ ఆర్సీ నిబంధన మేరకు గ్రూప్ అప్ డాక్టర్స్ తో పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. ఆత్మహత్య ఘటనపై మేజిస్ట్రీయల్ విచారణ జరిపిస్తామన్నారు.. సీఐ శ్రీనివాస్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు ఎస్పీ ఫక్కీరప్ప.
తాజావార్తలు
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!