తిరుపతి పర్యటనకు సీఎం జగన్ బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరారు సీఎం జగన్. అయితే ఈరోజు 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా కు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకనున్నారు ముఖ్యమంత్రి జగన్. అమిత్ షాతో కలిసి శ్రీ వారిని దర్శించుకుని రాత్రికి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. అయితే హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన పైన సర్వత్రా ఆసక్తి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి రేణిగుంటకు బయల్దేరి వెళ్తారు జగన్. అలాగే, రాత్రి 7 గంటల ప్రాంతంలో రేణిగుంటకు చేరుకునే కేంద్ర హోం మంత్రి అమిత్షాకు జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం రేణిగుంట నుంచి తిరుమల చేరుకుంటారాయన. రాత్రి తొమ్మిదిన్నరకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరిగి రేణిగుంటకు చేరుకుని… అక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు ముఖ్యమంత్రి.…
ఏపీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా మూడు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ నెల 13 వ తేదీన రాత్రి తిరుపతి లో బస చేయనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ నెల 14 వ తేదీన ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 14 వ తేదీన మధ్యాహ్నం…
ఉత్తర ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇవాళ వారణాసి వెళ్తనున్నారు. ఆయన తూర్పు యూపీలోనే రెండు రోజులపాటు పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొనే అవాకశముంది. బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లు,…
హిందీ కొన్ని రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారుతోంది.. అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తోంది లాంగ్వేజ్.. చివరకు మా వళ్ల కాదు బాబోయ్ అంటూ కేంద్రానికి లేఖ రాసేవరకు వెళ్లింది పరిస్థితి.. ఇంతకీ హిందీ భాష ఇబ్బందిపెడుతోన్న ఆ రాష్ట్రం ఏంటి..? ఆ లేఖ సంగతి ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాశారు మిజోరాం ముఖ్యమంత్రి పూ జోరంతంగ.. తమ కేబినెట్లోని మంత్రులకు హిందీ రాదని…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు పట్టుకున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరిగినా.. ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు ఈటల.. మిగతా మండలాల్లో ఈటలకు అనుకూలమైన ఓటింగే భారీగా ఉందనే అంచనాలున్నాయి.. దీంతో.. ఈటల గెలుపు నల్లేరు మీద నడకే అని అంచనా వేస్తున్నారు. ఇక, ఈటల ఆధిక్యం పెరుగుతున్నా కొద్ది.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…
కాశ్మీర్ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులు కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించారు. కాశ్మీర్లో తీవ్రవాదుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు అమిత్షా. జమ్మూకాశ్మీర్ లో ఇవాళ రెండోరోజు తన పర్యటనను కొనసాగిస్తున్నారు కేంద్ర హోంమంత్రి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా.…
మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేటి నుంచి జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులే టార్గెట్ గా ఉగ్ర దాడులు జరుగుతున్న తరుణంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ క్రమంగా మసకబారుతుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే బాబు గత కొంతకాలంగా రాజకీయంగా విఫలం అవుతున్నారు. ట్రెండ్ తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహాలు ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. 2020లోనూ పాతకాలం నాటి వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకోవడంతో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇమేజ్ ఏపీలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ డ్యామేజ్ అవుతుండటం శోచనీయంగా మారింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా…
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా…