అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 22న రామాలయంలో రాంలాలా జీవితం పవిత్రం కానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్షణం కోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపు ఢిల్లీలో రామ మందిరం శంకుస్థాపన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు కూడా హాజరు…
Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీత్-ఎ-హురియత్(TeH)పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)ని 'చట్టవిరుద్ధమైన సంఘం'గా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో వేర్పాటువాద నాయకుడు, మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది.
రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. అంతర్గత కలహాలను దూరం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గురువారం పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశమైన షా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ విభేదాల వల్ల పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని, రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నందున వారి ప్రవర్తనను తట్టుకోడానికి పార్టీ సిద్ధంగా లేదని నేతలతో…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో 35శాతం ఓట్ల తో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8కి వచ్చామన్నారు అమిత్ షా. ఇది వచ్చే ఎన్నికల్లో 64కావచ్చు .. 95 కూడా కావచ్చు అని, తెలంగాణలో భవిష్యత్తు…
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. డిసెంబర్ 28న ఆయన రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేకపూజలు…
లోక్సభలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. అనంతరం మూజువాణి ఓటింగ్ చేపట్టి ఈ బిల్లులను లోక్సభ ఆమోదించింది. . పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై నిరసనల నేపథ్యంలో 143 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ మధ్య ఈ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ..…
New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.