Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ వివాదంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హోమంత్రికి చరిత్రను తిరగరాసే అలవాటు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘పండిట్ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అర్పించారు,
జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తాం.. త్వరలో జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. మరోవైపు.. ఆర్టికల్ 370పై అమిత్ షా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్లో విలీనం ఆలస్యం కావడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కారణమని అన్నారు. 370 తాత్కాలిక పరిష్కారమని సుప్రీంకోర్టు అంగీకరించిందని తెలిపారు.…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలనే తన దీర్ఘకాల డిమాండ్ను లేవనెత్తారు.
Congress: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితిలోకి కాశ్మీర్ సమస్యను తీసుకుపోవడం వంటి ఈ రెండు తప్పులు కాశ్మీర్ వివాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023, రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను ఆయన నిన్న లోక్సభలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనుంది. బిల్లులలోని కీలక అంశాలను అమిత్ షా సభకు వెల్లడించారు.
Amit Shah: లోక్సభలో కాశ్మీర్ సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్ల్-2023ని లోక్సభలో ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ సమస్యకు భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని మరోసారి నిందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు మాజీ ప్రధాని బాధ్యత వహించాలని అమిత్ షా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని లేకపోతే అది భారతదేశంలో భూభాగం ఉండేదని ఆయన చెప్పారు.
Manipur: గత కొంత కాలంగా జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. రాష్ట్రంలో మైయిటీ, కుకీల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారుగా 200 మంది వరకు మరణించగా.. చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF), కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా…
CAA: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం( సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)(సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసకు పాల్పడుతోందిన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఇక ప్రచారానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలు మరింత దూకుడు పెంచుతాయి.
BJP Meetings: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు కేంద్రంలోని అధికార బీజేపీ కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.