Amit Shah: హైదరాబాద్కు రానున్న అమిత్ షా.. ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే కాకుండా ఓటింగ్ శాతాన్ని కూడా మెరుగుపరుచుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకత్వం వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుల స్థాయి నుంచి వెయ్యి మందికి పైగా నాయకులు హాజరవుతారని సమాచారం. ఈ భేటీలో లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనా.. ఈ ప్రశ్నకు సమాధానం రావడం లేదు. రాష్ట్ర నాయకత్వం, హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మందిలో ఒక్కరే సీనియర్ని, వరుసగా మూడు ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజాసింగ్ తనకు పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
Read also: Rajanna Sircilla: క్రిస్మస్ వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- OTR : గ్రేటర్ ఎన్నికలపై BJP టెన్షన్..? కాంగ్రెస్ వ్యూహాలపై కమలం అప్రమత్తం!
అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం రాజాసింగ్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఆయనకు అడ్డంకిగా మారగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాలకు దిగడం మరో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కు ఫ్లోర్ లీడర్ ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని నాయకత్వం భావిస్తోంది. ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కామారెడ్డిలో గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మరికొందరు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్దవాడైన ముథోల్ ఎమ్మెల్యే రాంరావు పవార్ పేరు తెరపైకి తెచ్చినా.. భాషా సమస్య ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి, రమణారెడ్డిలలో ఒకరికి ఫ్లోర్ లీడర్ పదవి దక్కే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 28న అమిత్ షా నేతృత్వంలోని శాసనసభాపక్ష నేత ఎన్నికపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈసారి తెలంగాణలో కనీసం పది పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో 8 సీట్లు గెలుచుకుని ఊపుమీదున్న బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
Swami Prasad Maurya : అఖిలేష్ యాదవ్ కు పెద్ద తలనొప్పిగా మారిన స్వామి ప్రసాద్ మౌర్య
తాజావార్తలు
-
Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!
-
Aprilia SR 175: కొత్త థీమ్తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
-
Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?
-
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
-
Samsung Galaxy A27 5G: 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 2032 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీ!
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!