New criminal laws: మూకదాడికి పాల్పడితే ఇక మరణశిక్షే.. దేశద్రోహ చట్టానికి ఇక చెల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
బుధవారం మూడు క్రిమినల్ చట్టాలను అమిత్ షా లోక్సభ ముందుకు తీసుకువచ్చారు. బ్రిటీష్ వారు చేసిన దేశద్రోహ చట్టం, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి స్వాతంత్ర సమరయోధులను అనేక ఏళ్లు జైలులో ఉంచింది. ఈ చట్టం ఈ రోజు వరకు కొనసాగుతోంది. మొట్టమొదటి సారిగా మోదీ ప్రభుత్వం ఈ దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తుంది అని ఆయన లోక్సభలో ప్రకటించారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Pakistan: పాకిస్తాన్లో మరొకడిని లేపేశారు..
కొత్త బిల్లులు శిక్షకు బదులుగా న్యాయంపై దృష్టి సారించేలా దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు-2023, భారతీయ సాక్ష్యా బిల్లు-2023లను మొదటిసారిగా కేంద్ర ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుల్లో సవరణలు తీసుకువచ్చి మళ్లీ ప్రవేశపెట్టారు.
కొత్త న్యాయచట్టాలు పోలీస్ జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే వ్యవస్థగా తీసుకువస్తామని అమిత్ షా అన్నారు. అరెస్టయిన వ్యక్తలు గురించి వివరాలు ఇప్పుడు ప్రతీ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడాలని, ఈ రికార్డులను నిర్వహించే బాధ్యత పోలీస్ అధికారిదే అని ఆయన అన్నారు. అక్రమ రవాణా చట్టాలను లింగ తటస్థంగా మార్చిందని చెప్పారు. 18ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే, కొత్త చట్టాల ప్రకారం పోక్సో చట్టానికి సమానమైన నిబంధనలు ఆటోమెటిక్గా వర్తిస్తాయని అన్నారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..