Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్లో అమిత్ షా అన్నారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమిత్ షా అక్క రాజుబెన్ సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు లంగ్స్ మార్పిడి జరిగింది. ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకునే దశలో ఉన్నారు. ఈలోపే ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. దీంతో జైపూర్లో నేటి నుంచి మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేటి సాయంత్రం జరిగే డీజీ-ఐజీ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా జైపూర్ చేరుకోనున్నారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం కోసం ఇప్పటికే రూల్స్ రెడీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే సీసీఏ కోసం నిబంధనలు జారీ చేయబోతున్నామని, నిబంధనల జారీ తర్వాత చట్టం అమలు చేయబడుతుందని, అర్హులైన వారికి భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుందని విషయం తెలిసిన ఓ అధికారి తెలిపారు.
ప్రాణ ప్రతిష్ట వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) ధరంపాల్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 22న రామాలయంలో రాంలాలా జీవితం పవిత్రం కానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్షణం కోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపు ఢిల్లీలో రామ మందిరం శంకుస్థాపన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు కూడా హాజరు…
Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీత్-ఎ-హురియత్(TeH)పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)ని 'చట్టవిరుద్ధమైన సంఘం'గా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో వేర్పాటువాద నాయకుడు, మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది.
రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. అంతర్గత కలహాలను దూరం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గురువారం పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశమైన షా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ విభేదాల వల్ల పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని, రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నందున వారి ప్రవర్తనను తట్టుకోడానికి పార్టీ సిద్ధంగా లేదని నేతలతో…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో 35శాతం ఓట్ల తో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8కి వచ్చామన్నారు అమిత్ షా. ఇది వచ్చే ఎన్నికల్లో 64కావచ్చు .. 95 కూడా కావచ్చు అని, తెలంగాణలో భవిష్యత్తు…