Historic Peace Deal: కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. అమిత్ షా సమక్షంలో సంతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam separatist group ULFA signs peace deal with government, Amit Shah present: యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) అనుకూల వర్గం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో కేంద్రం, అస్సాం ప్రభుత్వంతో త్రైపాక్షిక సెటిల్మెంట్ మెమోరాండంపై సంతకం చేసింది. ఉల్ఫా అనేది అస్సాంలోని అతి పురాతన తిరుగుబాటు గ్రూపు. శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. అసోం భవిష్యత్తుకు ఈరోజు ఉజ్వలమైన రోజు కావడం నాకు సంతోషకరమైన విషయమని, చాలా కాలంగా అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయన్నారు. ఉల్ఫా మెమోరాండమ్పై సంతకం చేయడం మొత్తం ఈశాన్య ప్రాంతాలకు, ముఖ్యంగా అస్సాంకు శాంతి యొక్క కొత్త కాలం ప్రారంభాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. 2014లో మోదీ తర్వాత ప్రధాని మోదీ ప్రధానమంత్రి అయ్యాక,, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు.
Read Also: Russia-Ukraine War: ఒక్కరాత్రిలో 122 క్షిపణులు, 36 డ్రోన్లు!.. ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అరబింద రాజ్ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా బృందం, ప్రభుత్వం మధ్య 12 సంవత్సరాల బేషరతు చర్చల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు. ఈ శాంతి ఒప్పందం అస్సాంలో దశాబ్దాల నాటి తిరుగుబాటుకు తెరపడుతుందని భావిస్తున్నారు. రాజ్ఖోవా వర్గం సెప్టెంబర్ 3, 2011న ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (SOO) ఒప్పందం సంతకం చేయబడింది.
1990లో నిషేధించబడింది..
అయితే, పరేష్ బారుహ్ నేతృత్వంలోని ఉల్ఫా యొక్క కరడుగట్టిన వర్గం ఒప్పందంలో భాగం కాదు. చైనా-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో బారువా నివసిస్తున్నట్లు సమాచారం. సార్వభౌమ అస్సాం డిమాండ్తో 1979లో ఉల్ఫా ఏర్పడింది. అప్పటి నుండి ఇది అనేక విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంది, దీని కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధిత సంస్థగా ప్రకటించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..