భారత్లో స్మార్ట్ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిమాండ్కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారాలు ఎక్కువ అవ్వడం, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులతో మొబైల్స్ అమ్మకాలు మరింత ఎక్కువ…
ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం వాక్సినేషన్.. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు టీకాలను ప్రోత్సహించడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. అయితే అమెరికా కొలరాడో రాష్ట్రం వ్యాక్సినేషన్ను ప్రోత్సాహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ లాటరీని ప్రవేశపెట్టింది. కాగా, తాజాగా లక్కీ లాటరీ డ్రా పేర్లను అనౌన్స్ చేయగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. హైడీ రెస్సెల్ అనే మహిళను విజేతగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు.…
‘అలా అమెరికాపురములో’… థమన్ తన టీమ్ తో సందడి చేయబోతున్నాడు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వరుస కచేరిలతో ఎన్నార్ లను అలరించనున్నాడు. ఇటువంటి మ్యూజికల్ టూర్స్ బాలీవుడ్ సంగీత దర్శకులు, గాయకులకు మామూలే. మన వాళ్లు చాలా తక్కువగా విదేశాల్లో మ్యూజికల్ కన్సర్ట్స్ ప్లాన్ చేస్తుంటారు. పైగా గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న కరోనా కల్లోలం పరిస్థితుల్ని మరింత కఠినతరంగా మార్చేసింది. అయినా, యూఎస్ లో నెలకొంటోన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా త్వరలోనే…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా రజనీ అమెరికాలోని తన స్నేహితులలో కలిసి ఖుషిఖుషీగా మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రజనీ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రజనీ అమెరికాలోని అత్యుత్తమైన మాయో క్లినిక్లో ఇటీవల…
డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నది. ఈ వేరియంట్ ఇప్పటికే 80కి పైగా దేశాల్లో విస్తరించింది. మాములు మామూలు సార్స్ కోవ్ 2 వైరస్ కంటే ఈ డెల్టా వేరియంట్ ప్రమాదకారి అని, వేగంగా విస్తరించే తత్వం కలిగి ఉన్నట్టు అమెరికా అంటువ్యాధున నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. ఈ వ్యాధి తీవ్రతకు కూడా ఈ వేరియంట్ ఒక కారణం అవుతుందని డాక్టర్ ఫౌసీ తెలిపారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరు వేయించుకోవాలని, ప్రస్తుతానికి…
అమెరికాలో తుఫాన్ తాకిడితో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలబామా ప్రాంతంలో తుఫాను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో గ్రీన్విల్లే నగర సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో కనీసం 15 కార్లు చిక్కుకొన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ వచ్చిన వరదలు, టొర్నడోలు చాలా ఇళ్లను ధ్వంసం చేశాయని అధికారులు వివరించారు. ఈ…
కోలీవుడ్ లో సీనియర్ లిరిసిస్ట్, అద్భుతమైన కవి అయిన వైరముత్తు మరోసారి నెటిజన్స్ నోళ్లలో నానాడు. అబ్బే! ఈసారి ఏ చిన్మయి లాంటి అమ్మాయో ఆయన పేరు మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేయలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం వైరముత్తు ఓ అందమైన సందేశం సొషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమిళంలో ఆయన రాసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ లో చర్చగా మారింది…కొన్నాళ్ల క్రితం ‘అన్నాత్తే’ షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుండగా తలైవా ఆరోగ్యం…
సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్ గా అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రజనీ అనారోగ్యానికి గురయ్యారని ఈ కారణంగానే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన సాధారణ మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఈమధ్య ఆయన అనారోగ్యానికి సంబంధించి వార్తలు వస్తుండటంతో.. రజనీ సడన్ గా అమెరికా వెళ్లడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కరోనా పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై…
పెళ్లి పేరుతో ఓ యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేశాడు ఓ ఘరానా మోసగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు మ్యాట్రిమోనీలో హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీ లో అప్డేట్ చేసింది. అయితే మునగర్స్ మేహుల్ కుమార్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పని చేస్తున్నాను అని ఆ యువతిని మోసం చేశాడు. ప్రొఫైల్ నచ్చిందని, వివాహం చేసుకోవడానికి అంగీకారమే…
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య తరువాత దేశంలో ఉద్యమం జరిగింది. బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో పెద్ద ఎత్తున అమెరికాలో ప్రజలు ఉద్యమించారు. లాఠీ ఛార్జ్, కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు కారణమైన పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా, కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పును అమెరికా కోర్టు వెలువరించింది. 12 మంది సభ్యులతో కూడిన…