Flash Floods: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
- అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు
- వరదలు, కొండచరియలు బీభత్సం
- 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు వేర్వేరు ఘటనల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఆర్మీకి చెందిన రెండు షెల్టర్లు వరదల్లో కొట్టుకుపోవడంతో ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు. మరోవైపు అప్పర్ సుబాన్సిరి జిల్లాలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు శుక్రవారం సాయంత్రం భారీ వర్షాల అనంతరం చోటుచేసుకున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.
అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని కియోజారింగ్-బ్యాచింగ్ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో టాడు బాకీ, తాజీ రాయ్, మార్కోష్ బసుమతారి, బాబుల్ అలీ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు బాబుల్ అలీ మృతదేహాన్ని మాత్రమే వెలికితీసినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాచో పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఘటనాస్థలికి తరలించారు. దపోరిజో నుంచి ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలను కూడా రంగంలోకి దించారు. సహాయక చర్యల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం కూడా పాల్గొంటోంది.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని పసు పాని ఆర్మీ క్యాంప్ వద్ద భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 5వ గ్రెనేడియర్స్కు చెందిన రెండు షెల్టర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సమయంలో మొత్తం ఏడుగురు ఆర్మీ సిబ్బంది వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరిని సురక్షితంగా రక్షించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని హవల్దార్ ఉపేందర్, కుందన్, వినోద్, ఆదిత్య, సముందాగా గుర్తించారు.
గల్లంతైన సైనికుల కోసం ఆర్మీ రెండు సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. 5వ గ్రెనేడియర్స్ సిబ్బందితో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 58వ బెటాలియన్, జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (GREF)కు చెందిన 62 రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ (RCC) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు, స్థానిక వాలంటీర్లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలకు సహకరిస్తున్నారు. పాసిఘాట్ నుంచి మరో ఎస్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ను మరింత బలోపేతం చేసేందుకు అనిని వైపు బయలుదేరింది. రెండు ప్రాంతాల్లోనూ సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు రెస్క్యూ సిబ్బందికి సవాలుగా మారుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!