రాహుల్ గాంధీ వ్యవహారం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ అనర్హత విషయంలో పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. తాజాగా జర్మనీ స్పందించింది.
కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు.
39 killed in fire near Mexico-USA border: సొంత దేశంలో ఉండలేక, అమెరికాకు వెళ్ధామనుకున్న శరణార్ధులను అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. మెక్సికోలిని సిడెడ్ జారే నగరంలోని శరణార్థి శిబిరంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 39 మంది శరణార్థులు మరణించినట్లు తెలుస్తోంది. మెక్సికన్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 39 మంది మరణించగా.. 29 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన…
ఒక వర్జీనియా మహిళ తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసినందుకు దోషిగా తేలింది, దానిలో ప్రాసిక్యూటర్లు తన మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక వక్రీకృత ప్రయత్నమని చెప్పారు. అతను ఒక అమ్మాయిని విడిచిపెట్టాలని అనుకున్నాడు.వెరోనికా యంగ్బ్లడ్(37) తన పిల్లలైన 15 ఏళ్ల షారన్ కాస్ట్రో, 5 ఏళ్ల బ్రూక్లిన్ యంగ్బ్లడ్ను చంపినట్లు అంగీకరించింది.
అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేస్తున్నది.
ఓ వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు అమెరికాలోని ఓ న్యాయస్థానం అరుదైన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తితో జరిగిన వివాదంలో తన వద్ద ఉన్న హ్యాండ్గన్తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదల కాగా.. అవతలి వ్యక్తి తప్పించుకున్నాడు.
Indian journalist attacked Khalistani supporters: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత తొమ్మిదిరోజులుగా అతను తన రూపాన్ని మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంత జరిగిన పంజాబ్ ప్రశాంతంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న రాడికల్ ఎలిమెంట్స్, ఖలిస్తానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ వారం యూకే లండన్ లోని భారత హైకమిషన్ పై దాడి చేశారు.
Huge Tornado Destroys US Towns: అమెరికాను టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు పట్టణాలు ధంసం అయ్యాయి. తీవ్రమైన గాలి, ఉరుములు, మెరుపులు, వర్షంతో టోర్నడోలు విరుచుకుపడటంతో మిసిసిపి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికే వీటి ధాటికి 25 మంది మణించారు. మరణాల సంఖ్య మరింగా పెరిగే అవకాశం ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మిసిసీపిలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
Donald Trump: తనపై అభియోగాలు మోపితే మరణాలు, విధ్వంసమే అని ట్రంప్ హెచ్చరించారు. స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ విచారణలో అభియోగాలు మోపితే బాగుండంటూ మాన్ హట్టన్ అటార్నీని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ముందు పోర్న్ స్టార్ తో సంబంధాల గురించి బయటపడకుండా డబ్బులతో ప్రలోభపెట్టాడనే కేసును మాన్ హట్టన్ అటార్నీ విచారించేందుకు సిద్ధం అయిందని, తనపై అభియోగాలు మోపి రోజుల్లో అరెస్ట్ చేస్తారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు…
Amazon: మామూలుగా ఏదైనా పోలీస్ ఆపరేషన్ జరుగుతుంటే జనాలు ఆ ప్రాంతం చుట్టువైపుల కూడా వెళ్లరు. అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం ఓ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఇలాంటి పరిస్థితుల మధ్య తన వృత్తి ధర్మాన్ని పాటించాడు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో కూడా పార్సిల్ ఇచ్చేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు దీనిపై వార్తల్ని ప్రసారం చేశాయి.