Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
- ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్కు గ్రీన్ సిగ్నల్
- ₹2,278 కోట్లతో మెగా ప్రాజెక్ట్
- ఉత్తర తెలంగాణకు కొత్త ఊపు
- 2026 నాటికి పనులు పూర్తి లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ రూపురేఖలను మార్చే గేమ్చేంజర్గా నిలవడమే కాకుండా ప్రాంతీయ పురోగతికి సరికొత్త శకాని నాంది పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.
2,009 ఎకరాల్లో అత్యాధునిక ఏవియేషన్ హబ్
మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్లో అత్యాధునిక మౌలిక వసతులను కల్పించనున్నారు. సివిల్ ఏవియేషన్ (సాధారణ విమాన ప్రయాణాలు) తో పాటు కార్గో రవాణా, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Overhaul) సదుపాయాలను ఇక్కడ ఏకకాలంలో అందుబాటులోకి తేనున్నారు. రక్షణ రంగంతో పాటు పౌర విమానయాన అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్ట్ను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నారు.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
పారిశ్రామిక, పర్యాటక రంగాలకు విపరీతమైన ఊతం
ఈ ఎయిర్ఫీల్డ్ అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు బాటలు పడనున్నాయి. ముఖ్యంగా కార్గో సదుపాయం కలగడం వల్ల ప్రాంతీయ వ్యాపార, వాణిజ్య రంగాలు పుంజుకోవడంతో పాటు పర్యాటక రంగానికి విశేష ప్రజాదరణ లభించనుంది. రక్షణ , పౌర విమానయాన రంగాలు ఒకే చోట చేరడం ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
2026 డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి
ఈ ప్రాజెక్ట్కు సంబంధించి భూసేకరణ , అవసరమైన మౌలిక వసతుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ వల్లే ఉత్తర తెలంగాణ సుదీర్ఘ కల నెరవేరుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?