ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. అమరావతి- ఎల్లుండి కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. చంద్రబాబుతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై చర్చ. మొత్తం మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారా..? లేక తొలి విడతలో పరిమిత సంఖ్యతో సరిపెడతారా..? అని తర్జన భర్జన. చంద్రబాబుతో పాటు డెప్యూటీ సీఎంగా పవన్, మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం ఖాయమంటోన్న టీడీపీ – జనసేన వర్గాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు బీజేపీ ప్రతినిధి మంత్రిగా ప్రమాణ…
Amaravati: ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరు మొగ్గు చూపారు ఎన్నికల్లో గెలుస్తే అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో…
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన అధికారుల బృందాన్ని, కలెక్టర్లను ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. . ఇప్పటికే ఆరోపణలు ఎదురుకుంటున్న జవహర్ రెడ్డి (సీఎస్) తో పాటు కొందరు అధికారులకు బదిలీలు జారీచేశారు కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్కుమార్ ఎంపిక జరిగింది ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించారు. మరిన్ని వివరాలు…
రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ రాశారు.
ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచనగా పేర్కొన్నారు.. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన.. రాజధాని కట్టే అవకాశం ఉన్నా.. ఐదేళ్లు తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది.. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు.
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.