Amaravati: రాజధాని రైతులకు కౌలు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిటిషన్.. తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సకాలంలో కౌలు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. పిటిషన్లను అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ,రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేశాయి. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
Also Read: AP High Court: ప్రభుత్వ జీవోలు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటి?
Also Read
రైతులు సొసైటీల పేరుతో పిటీషన్లు దాఖలు చేయడంపై సీఆర్డీఏ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన చిన్న, సన్న కారు రైతుల సంఖ్య, వివరాలను న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలు న్యాయమూర్తి ముందుంచారు రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్. 28720 మంది రైతులు ఇచ్చిన భూమి 34396.96 ఎకరాలు అని కోర్టుకు వెల్లడించారు. వీరిలో ఎకరా లోపు 20176 మంది రైతులు ఉన్నట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్ న్యాయవాది తెలిపారు. 1 ఎకరా నుండి 2 ఎకరాల్లోపు వున్న రైతులు 4,217 మంది ఉన్నారని న్యాయవాది చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!