Amaravati: రాజధాని రైతులకు కౌలు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిటిషన్.. తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సకాలంలో కౌలు చెల్లించకపోవడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. పిటిషన్లను అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ,రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేశాయి. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
Also Read: AP High Court: ప్రభుత్వ జీవోలు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటి?
Also Read
రైతులు సొసైటీల పేరుతో పిటీషన్లు దాఖలు చేయడంపై సీఆర్డీఏ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన చిన్న, సన్న కారు రైతుల సంఖ్య, వివరాలను న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలు న్యాయమూర్తి ముందుంచారు రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్. 28720 మంది రైతులు ఇచ్చిన భూమి 34396.96 ఎకరాలు అని కోర్టుకు వెల్లడించారు. వీరిలో ఎకరా లోపు 20176 మంది రైతులు ఉన్నట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్ న్యాయవాది తెలిపారు. 1 ఎకరా నుండి 2 ఎకరాల్లోపు వున్న రైతులు 4,217 మంది ఉన్నారని న్యాయవాది చెప్పారు.
తాజావార్తలు
-
Hypersonic Missiles: హైపర్సోనిక్ క్షిపణి టెక్నాలజీలో భారత్ కీలక విజయం.. DRDO స్క్రామ్జెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
-
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
-
Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
-
Kalki 2: ‘కల్కి 2’ సీక్వెల్పై షాకింగ్ అప్డేట్స్!
-
Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు